Maoist Party: మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన
- వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు హతం
- ఈ నేపథ్యంలో పార్టీ కీలక ప్రకటన
- శాంతి చర్చలకు సిద్ధమని కేంద్ర కమిటీ స్పష్టం
- అభయ్ పేరుతో ఒక లేఖ విడుదల
వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..
READ MORE: Dog Video: రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా పట్టాలపై పడ్డ డాగ్.. చివరికిలా..!
Also Read
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అనుగుణంగా తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో జరుగుతున్న హింసకాండను వెంటనే ఆపాలని, అక్కడున్న సాయిధ బలగాలను నిలవరించాలని, ఈ ప్రతిపాదనలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటే తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ సమయంలో తాము కాల్పుల విరమణ కూడా ప్రకటిస్తామని వెల్లడించింది.. ఇటీవల కాలంలో హైదరాబాద్లో శాంతి చర్చకు సంబంధించి మేధావులు మానవ హక్కుల సంఘాలు పలువురు నేతలు జరిపిన సమావేశానికి స్పందిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ మేరకు లేఖను విడుదల చేసింది.
READ MORE: Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ నుండి మూడో పాటకి డేట్ లాక్ ?
కాగా.. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దేశంలో ఎక్కడ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నా వరంగల్ ప్రాంతానికి చెందిన కీలక నేతల ప్రస్తావన వస్తోంది. ఎక్కడ పోలీసుల తూటా పేలినా ఇక్కడి వారు మృత్యువాత పడుతున్నారు. వారి కుటుంబాలకు కన్నీరు మిగిలిస్తోంది. గత మూడు నెలల కాలంలో జరిగిన ఎన్కౌంటర్లలతో వంద మందికిపైగా నేలకొరిగారు. గతేడాది జరిగిన ఎన్కౌంటర్లలో 287 మంది మృత్యువాతపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లతో ఇక్కడి వారు చనిపోతుండడంతో జిల్లాలోని మావోయిస్టు నేతల కుటుంబ సభ్యులు, బంధువుల్లో వణకు పుడుతోంది. ఎప్పుడూ ఎలాంటి సమాచారం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!