Manipur BJP Ally: మణిపూర్ సమస్య పరిష్కారానికి సర్జికల్ స్ట్రైక్ లాంటి చర్య జరగాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur BJP Ally: మణిపూర్లో అక్రమ వలసదారులు, మిలిటెంట్ల సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రభావవంతమైన చర్య జరగాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు. మణిపూర్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఎన్పీపీ ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మణిపూర్ రాష్ట్రం గత మూడు నెలలుగా 150 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న జాతి హింసను చూస్తోన్న సంగతి తెలిసిందే.
Read Also: Delhi Services Act: రాష్ట్రపతి ఆమోదం.. చట్టంగా మారిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
Also Read
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
- Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
- Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
“సరిహద్దు దాటి కొందరు అక్రమ కుకీ ఉగ్రవాదులు, వలసదారులు వస్తున్నారని హోం మంత్రి చేసిన ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఇందులో బాహ్య దురాక్రమణ ప్రమేయం ఉందని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. మనం మణిపూర్ను మాత్రమే కాకుండా మొత్తం దేశాన్ని కూడా రక్షించడం చాలా ముఖ్యం. సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి కొన్ని సమర్థవంతమైన చర్యలు చేయాలి.” అని ఎన్పీపీ నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు.
Read Also: Pakistan Economic Crisis: పాక్ ఆర్థిక గణాంకాలు వెల్లడి.. ఇప్పట్లో సంక్షోభం నుంచి కోలుకోనట్లే
గత నెలలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో నివసిస్తున్న మయన్మార్ నుండి అక్రమ వలసదారుల బయోమెట్రిక్ డేటాను సంగ్రహించడం ప్రారంభించింది. జులైలో కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి 700 మంది అక్రమ వలసదారులు ప్రవేశించారని మణిపూర్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. హోం శాఖ ప్రకటన ప్రకారం.. మణిపూర్లో హింస చెలరేగుతున్న సమయంలో జూలై 22, 23 తేదీల్లో 301 మంది పిల్లలతో సహా 718 మంది అక్రమ వలసదారులు మణిపూర్లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు. మణిపూర్ మే 3 నుంచి కుకీ, మెయిటీ తెగల మధ్య జాతి కలహాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అక్రమ వలసదారులను గుర్తించడానికి బయోమెట్రిక్ ప్రక్రియను చేపట్టి సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని మణిపూర్, మిజోరాం ప్రభుత్వాలను కేంద్రం గతంలోనే కోరింది.
తాజావార్తలు
-
Electric Scooters: ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా.. వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? పూర్తి వివరాలు
-
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా… ఐయండిబిలో 9.1 రేటింగ్… తెలుగులోనూ చూడచ్చు
-
Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
-
Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
-
Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..