Manipur BJP Ally: మణిపూర్ సమస్య పరిష్కారానికి సర్జికల్ స్ట్రైక్ లాంటి చర్య జరగాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur BJP Ally: మణిపూర్లో అక్రమ వలసదారులు, మిలిటెంట్ల సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రభావవంతమైన చర్య జరగాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు. మణిపూర్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఎన్పీపీ ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మణిపూర్ రాష్ట్రం గత మూడు నెలలుగా 150 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న జాతి హింసను చూస్తోన్న సంగతి తెలిసిందే.
Read Also: Delhi Services Act: రాష్ట్రపతి ఆమోదం.. చట్టంగా మారిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
“సరిహద్దు దాటి కొందరు అక్రమ కుకీ ఉగ్రవాదులు, వలసదారులు వస్తున్నారని హోం మంత్రి చేసిన ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఇందులో బాహ్య దురాక్రమణ ప్రమేయం ఉందని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. మనం మణిపూర్ను మాత్రమే కాకుండా మొత్తం దేశాన్ని కూడా రక్షించడం చాలా ముఖ్యం. సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి కొన్ని సమర్థవంతమైన చర్యలు చేయాలి.” అని ఎన్పీపీ నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు.
Read Also: Pakistan Economic Crisis: పాక్ ఆర్థిక గణాంకాలు వెల్లడి.. ఇప్పట్లో సంక్షోభం నుంచి కోలుకోనట్లే
గత నెలలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో నివసిస్తున్న మయన్మార్ నుండి అక్రమ వలసదారుల బయోమెట్రిక్ డేటాను సంగ్రహించడం ప్రారంభించింది. జులైలో కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి 700 మంది అక్రమ వలసదారులు ప్రవేశించారని మణిపూర్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. హోం శాఖ ప్రకటన ప్రకారం.. మణిపూర్లో హింస చెలరేగుతున్న సమయంలో జూలై 22, 23 తేదీల్లో 301 మంది పిల్లలతో సహా 718 మంది అక్రమ వలసదారులు మణిపూర్లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు. మణిపూర్ మే 3 నుంచి కుకీ, మెయిటీ తెగల మధ్య జాతి కలహాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అక్రమ వలసదారులను గుర్తించడానికి బయోమెట్రిక్ ప్రక్రియను చేపట్టి సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని మణిపూర్, మిజోరాం ప్రభుత్వాలను కేంద్రం గతంలోనే కోరింది.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!