Manipur BJP Ally: మణిపూర్ సమస్య పరిష్కారానికి సర్జికల్ స్ట్రైక్ లాంటి చర్య జరగాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur BJP Ally: మణిపూర్లో అక్రమ వలసదారులు, మిలిటెంట్ల సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రభావవంతమైన చర్య జరగాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు. మణిపూర్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఎన్పీపీ ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మణిపూర్ రాష్ట్రం గత మూడు నెలలుగా 150 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న జాతి హింసను చూస్తోన్న సంగతి తెలిసిందే.
Read Also: Delhi Services Act: రాష్ట్రపతి ఆమోదం.. చట్టంగా మారిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
Also Read
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
“సరిహద్దు దాటి కొందరు అక్రమ కుకీ ఉగ్రవాదులు, వలసదారులు వస్తున్నారని హోం మంత్రి చేసిన ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఇందులో బాహ్య దురాక్రమణ ప్రమేయం ఉందని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. మనం మణిపూర్ను మాత్రమే కాకుండా మొత్తం దేశాన్ని కూడా రక్షించడం చాలా ముఖ్యం. సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి కొన్ని సమర్థవంతమైన చర్యలు చేయాలి.” అని ఎన్పీపీ నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు.
Read Also: Pakistan Economic Crisis: పాక్ ఆర్థిక గణాంకాలు వెల్లడి.. ఇప్పట్లో సంక్షోభం నుంచి కోలుకోనట్లే
గత నెలలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో నివసిస్తున్న మయన్మార్ నుండి అక్రమ వలసదారుల బయోమెట్రిక్ డేటాను సంగ్రహించడం ప్రారంభించింది. జులైలో కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి 700 మంది అక్రమ వలసదారులు ప్రవేశించారని మణిపూర్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. హోం శాఖ ప్రకటన ప్రకారం.. మణిపూర్లో హింస చెలరేగుతున్న సమయంలో జూలై 22, 23 తేదీల్లో 301 మంది పిల్లలతో సహా 718 మంది అక్రమ వలసదారులు మణిపూర్లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు. మణిపూర్ మే 3 నుంచి కుకీ, మెయిటీ తెగల మధ్య జాతి కలహాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అక్రమ వలసదారులను గుర్తించడానికి బయోమెట్రిక్ ప్రక్రియను చేపట్టి సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని మణిపూర్, మిజోరాం ప్రభుత్వాలను కేంద్రం గతంలోనే కోరింది.
తాజావార్తలు
-
Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
-
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!