Manik Rao Thakre : మరోసారి సమావేశం కానున్న తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితాను పార్టీ “సెంట్రల్ ఎలక్షన్ కమిటీ” ( కేంద్ర ఎన్నికల కమిటీ) కి పంపుతామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. విడతల వారీగా అభ్యర్దుల జాబితాను విడుదల చేయాలా, లేదా పూర్తి జాబితాను ఒకేసారి విడుదల చేయాలా అన్నది కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” నిర్ణయిస్తుందని తెలిపారు. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను “స్క్రీనింగ్ కమిటీ” సత్వరమే పూర్తి చేసి, పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” ఆమోదానికి పంపుతామని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు.
Also Read : Rajnath Singh : మహిళా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతతో కూడిన బహుమతి
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” మరోసారి సమావేశం కానున్నట్లు మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. అయితే.. ఈరోజు పూర్తి జాబితాను ఖరారు చేసి, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” ఆమోదానికి తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” పంపనున్నట్లు తెలిపారు. నిన్న అర్ధరాత్రి వరకు, సుమారు 8 గంటల పాటు ఏకధాటిగా సాగిన సమాలోచనలు జరిగాయి. తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా ను దాదాపు ఈ రోజే “సెంట్రల్ ఎలక్షన్ కమిషన్” ఆమోదానికి పంపనుంది “స్క్రీనింగ్ కమిటీ”.
అయితే.. నిన్న మొదటి భేటీ, నేడు కూడా భేటీ ఉంటుందని తెలిపారు మాణిక్ రావు ఠాక్రే. నిన్న సమావేశంలో అన్ని అంశాలపై చర్చ జరిగిందని, సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు మాణిక్ రావు ఠాక్రే. ఆశావహులు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని, అందరి “బయో డేటా” లు ( పూర్తి వివరాలు) మా దగ్గర ఉన్నాయని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. బీజేపీ, బీఅర్ఎస్ వేరు కాదని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు అభిప్రాయం కలిగించేందుకు బీఅర్ఎస్ చేసిన ప్రయత్నం విఫలం అయిందన్నారు మాణిక్ రావు ఠాక్రే. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి లేదని మాణిక్ రావు ఠాక్రే వ్యాఖ్యానించారు. పదేళ్ళలో కేసీఆర్ కుటుంబం తెలంగాణకు చేసిందేం లేదని, తెలంగాణలో సంపాదించిన డబ్బును పక్కరాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం కేసీఆర్
ఖర్చు చేస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!