Manik Rao Thakre : మరోసారి సమావేశం కానున్న తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితాను పార్టీ “సెంట్రల్ ఎలక్షన్ కమిటీ” ( కేంద్ర ఎన్నికల కమిటీ) కి పంపుతామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. విడతల వారీగా అభ్యర్దుల జాబితాను విడుదల చేయాలా, లేదా పూర్తి జాబితాను ఒకేసారి విడుదల చేయాలా అన్నది కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” నిర్ణయిస్తుందని తెలిపారు. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను “స్క్రీనింగ్ కమిటీ” సత్వరమే పూర్తి చేసి, పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” ఆమోదానికి పంపుతామని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు.
Also Read : Rajnath Singh : మహిళా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతతో కూడిన బహుమతి
Also Read
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” మరోసారి సమావేశం కానున్నట్లు మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. అయితే.. ఈరోజు పూర్తి జాబితాను ఖరారు చేసి, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” ఆమోదానికి తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” పంపనున్నట్లు తెలిపారు. నిన్న అర్ధరాత్రి వరకు, సుమారు 8 గంటల పాటు ఏకధాటిగా సాగిన సమాలోచనలు జరిగాయి. తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా ను దాదాపు ఈ రోజే “సెంట్రల్ ఎలక్షన్ కమిషన్” ఆమోదానికి పంపనుంది “స్క్రీనింగ్ కమిటీ”.
అయితే.. నిన్న మొదటి భేటీ, నేడు కూడా భేటీ ఉంటుందని తెలిపారు మాణిక్ రావు ఠాక్రే. నిన్న సమావేశంలో అన్ని అంశాలపై చర్చ జరిగిందని, సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు మాణిక్ రావు ఠాక్రే. ఆశావహులు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని, అందరి “బయో డేటా” లు ( పూర్తి వివరాలు) మా దగ్గర ఉన్నాయని మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. బీజేపీ, బీఅర్ఎస్ వేరు కాదని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు అభిప్రాయం కలిగించేందుకు బీఅర్ఎస్ చేసిన ప్రయత్నం విఫలం అయిందన్నారు మాణిక్ రావు ఠాక్రే. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి లేదని మాణిక్ రావు ఠాక్రే వ్యాఖ్యానించారు. పదేళ్ళలో కేసీఆర్ కుటుంబం తెలంగాణకు చేసిందేం లేదని, తెలంగాణలో సంపాదించిన డబ్బును పక్కరాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం కేసీఆర్
ఖర్చు చేస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!