Manik Rao Thackeray: ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రపూరితంగా వేసిన కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయం.. ప్రజల కోసం పని చేస్తున్న మనిషి రాహుల్ గాంధీ.. ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అని ఆయన తెలిపారు. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీని దెబ్బ తీయడానికి పరువు నష్టం కేసు వేసి ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేసి ఎంపీగా అనర్హుడిగా ప్రకటించి 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూండా దూరంగా ఉంచాలని బీజేపీ కుట్ర చేసిందన్నారు.
Read Also: Honey Rose : స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
Also Read
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
కానీ చివరకు న్యాయం గెలిచింది.. సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ప్రజలకు న్యాయం జరిగింది అని మాణిక్ రావు ఠాక్రే అన్నారు. బీజేపీ కుట్రలకు అడ్డు పడింది. రాహుల్ గాంధీ ప్రజల మధ్య పాదయాత్ర చేయడం వల్లే.. కర్ణాటకలో గెలిచాము.. తెలంగాణలో కూడా తప్పకుండా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ మంచి ప్రచార వ్యూహంతో ముందుకు దూసుకుపోతుందని ఠాక్రే అన్నారు.
Read Also: Drank Too Much Water: ఒక్కరోజులో తాగాల్సింది.. ఒకేసారి తాగింది.. ఆ తర్వాత గుండె ఆగింది
అయితే, ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంతో రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది అని మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. మంచి ప్రచార వ్యూహంతో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తే పక్కా గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్లిద్దరూ లోపాయికరిగా కలిసి పని చేస్తున్నారు. అసెంబ్లీ పరిధిలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతో అక్కడి సమస్యలపై పోరాడాలి అని ఠాక్రే అన్నారు. అవినీతి, లిక్కర్ దండాలు బీఆర్ఎస్ నేతలు చాలా చేశారు.. అవన్నీ బయటపెట్టి జనానికి తెలియజేసి ఎన్నికలో ప్రభావం చూపేలా చెయ్యాలి అని మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు.
Read Also: Sruthi Shanmuga Priya: పుట్టెడు దుఃఖంలో ఉన్నాం.. లైకుల కోసం మమ్మల్ని వేధించకండి!
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు గట్టిగా పనిచేయాలి.. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ చేశారు. వాటిని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలి అని మాణిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు కోసం తీసుకోబోతున్న అన్ని రకాల హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి.. పెద్ద ఎత్తున పోస్టర్లు, ప్రచార సామగ్రితో ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహించాలి అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!