Manik Rao Thackeray: ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రపూరితంగా వేసిన కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయం.. ప్రజల కోసం పని చేస్తున్న మనిషి రాహుల్ గాంధీ.. ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అని ఆయన తెలిపారు. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీని దెబ్బ తీయడానికి పరువు నష్టం కేసు వేసి ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేసి ఎంపీగా అనర్హుడిగా ప్రకటించి 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూండా దూరంగా ఉంచాలని బీజేపీ కుట్ర చేసిందన్నారు.
Read Also: Honey Rose : స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
Also Read
కానీ చివరకు న్యాయం గెలిచింది.. సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ప్రజలకు న్యాయం జరిగింది అని మాణిక్ రావు ఠాక్రే అన్నారు. బీజేపీ కుట్రలకు అడ్డు పడింది. రాహుల్ గాంధీ ప్రజల మధ్య పాదయాత్ర చేయడం వల్లే.. కర్ణాటకలో గెలిచాము.. తెలంగాణలో కూడా తప్పకుండా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ మంచి ప్రచార వ్యూహంతో ముందుకు దూసుకుపోతుందని ఠాక్రే అన్నారు.
Read Also: Drank Too Much Water: ఒక్కరోజులో తాగాల్సింది.. ఒకేసారి తాగింది.. ఆ తర్వాత గుండె ఆగింది
అయితే, ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంతో రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది అని మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. మంచి ప్రచార వ్యూహంతో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తే పక్కా గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్లిద్దరూ లోపాయికరిగా కలిసి పని చేస్తున్నారు. అసెంబ్లీ పరిధిలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతో అక్కడి సమస్యలపై పోరాడాలి అని ఠాక్రే అన్నారు. అవినీతి, లిక్కర్ దండాలు బీఆర్ఎస్ నేతలు చాలా చేశారు.. అవన్నీ బయటపెట్టి జనానికి తెలియజేసి ఎన్నికలో ప్రభావం చూపేలా చెయ్యాలి అని మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు.
Read Also: Sruthi Shanmuga Priya: పుట్టెడు దుఃఖంలో ఉన్నాం.. లైకుల కోసం మమ్మల్ని వేధించకండి!
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు గట్టిగా పనిచేయాలి.. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ చేశారు. వాటిని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలి అని మాణిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు కోసం తీసుకోబోతున్న అన్ని రకాల హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి.. పెద్ద ఎత్తున పోస్టర్లు, ప్రచార సామగ్రితో ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహించాలి అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!