Sumalatha: ఎన్నికల వేళ సుమలత అంబరీష్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలోని మాండ్య ఇండిపెండెంట్ ఎంపీ సుమలత అంబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సుమలత ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ బరిలోకి దిగి ఓడిపోయారు.
అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులో భాగంగా మాండ్య సీటు జేడీఎస్కు దక్కింది. దీంతో ఇక్కడ కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కుమారస్వామి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అయితే ఈ టికెట్ సుమలతకు లభిస్తుందని అంతా భావించారు. కానీ కుమారస్వామి పోటీలోకి దిగడంతో ఆమె లోక్సభ బరి నుంచి తప్పుకున్నారు. ఎన్నికల్లో కుమారస్వామికి మద్దతు తెల్పుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఇటీవలే సుమలతను కుమారస్వామి కలిసి.. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో 'రాగి రొట్టెలు' చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
- FIFA World Cup 2026: 'కురాకో'కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
- Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
- FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్కు వణుకు పుట్టించిన జపాన్..

దేశ ప్రజల కోసం, కర్ణాటక ప్రజల కోసం.. ప్రధాని కలలు నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుమలత చెప్పుకొచ్చారు. మాండ్య ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని తెలిపారు. మాండ్య ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని.. మాండ్యను విడిచిపెట్టబోనని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లు సుమలత పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: JP Nadda: ‘‘సగం మంది జైలులో, సగం మంది బెయిల్లో’’.. ఇండియా కూటమిపై నడ్డా ఫైర్..
మాండ్య నుంచి మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మద్దతుదారులు కోరారని చెప్పుకొచ్చారు. అలా చేస్తే ఓట్లు చీలిపోయి.. బీజేపీకి ఇబ్బంది కల్గుతుందని పేర్కొన్నారు. వేరే నియోజకవర్గాల్లో పోటీ చేయాలని బీజేపీ ఆఫర్లు ఇచ్చిందని.. కానీ తాను మాత్రం మాండ్యను విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు. ప్రధాని మోడీ సలహా మేరకే.. పోటీ నుంచి తప్పుకుని బీజేపీలో చేరుతున్నట్లు సుమలత క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Kodanda Reddy: పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ను బదనాం చేస్తున్నారు..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమవుతుంది. అనంతరం ఏప్రిల 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Perni Nani: చంద్రబాబువి దొంగ నాటకాలు.. ఎప్పుడైనా 1వ తేదీన పెన్షన్లు ఇచ్చారా?
తాజావార్తలు
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
-
Star Hero : వరుస ప్లాప్స్.. స్క్రిప్ట్ లు వినడానికి టీమ్ పెట్టుకున్న స్టార్ హీరో
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
Floating AI Data Centres: నీటిలో తేలియాడే AI డేటా సెంటర్లు.. శామ్సంగ్ కొత్త ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!
ట్రెండింగ్
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్పై హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!