Manda Krishna Madiga: ఎస్సీ రిజర్వేషన్ కు మీరు సపోర్ట్ ఇస్తే.. మేము అండగా ఉంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పై అభిప్రాయాలను తీసుకోవడానికి గాంధీభవన్ కు మంద కృష్ణ మాదిగ బృందం వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ నేతలతో మంద కృష్ణ సమావేశం అయ్యారు. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన వినతిపత్రాలు ఇచ్చారు.
Read Also: Gautham Adani: అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారం.. మరో 15 రోజులు గడువు కోరిన సెబీ
Also Read
- Indian Railways: RAC టికెట్కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
- Cricket Legends: ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు.. ఈ ఐదుగురు స్పిన్నర్ల రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం!
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
- CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మా ఆవేదన చెప్పడానికి గాంధీ భవన్ వచ్చాను అని తెలిపాడు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చిలికల సమస్య కాదు.. దళితుల మధ్య జరుగుతున్న అసమానతలు సరిద్దిద్దే ప్రయత్నం మాత్రమే అని ఆయన వెల్లడించారు. వర్గీకరణ అంశం.. సామాజిక అంశంగా గుర్తించిందే కాంగ్రెస్.. అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందటం లేదని లోకూర్ కమిటీని కాంగ్రెస్ వేసిందని మంద కృష్ణ అన్నారు. వర్గీకరణ అమలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సుప్రీంకోర్టు నిర్ణయంతో రద్దు అయ్యింది.. కానీ వర్గీకరణకి మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన పేర్కొన్నాడు.
Read Also: MP Laxman: తెలంగాణ విముక్తి కై బీజేపీ పోరాటం
ఎస్సీ వర్గీకరణకు కమిషన్లు వేసిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బిల్లు పెట్టలేదు అని మంద కృష్ణ అన్నారు.. బీజేపీ వర్గీకరణ చేస్తా అన్నది చెయ్యలేదు.. బీజేపీ మీద ఒత్తిడి పెంచండి అని రాహుల్ గాంధీని కలిశాను అని ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒత్తిడి పెంచండి అంటూ లేఖ ఇవ్వలేదు.. కనీసం తెలంగాణ ఎంపీలు కూడా వర్గీకరణ విషయం అడగలేదు.. కోమటిరెడ్డి, ఉత్తమ్ బయట మద్దతు ఇస్తున్నారు.. కానీ పార్లమెంట్లో కనీసం మాట్లాడలేదు అని మంద కృష్ణ మాదిగా అన్నారు.
మొన్న పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వర్గీకరణ విషయం ఎందుకు ప్రస్తావించలేదు అని ఆయన అడిగారు.
Read Also: Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు..!
మాకు లిప్ సింపతినేనా..? అసెంబ్లీలో కేసీఆర్ ని భట్టి కూడా అడగలేదు.. అలాంటప్పుడు మేము ఎలా మద్దతి ఇవ్వాలి అని మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సపోర్ట్ ఇస్తామని చెప్పాడు.. భవిష్యత్ కార్యచరణ ఉంటుంది అని మాట ఇచ్చారు.. వర్గీకరణకి మద్దతు ఇస్తే.. మేము అండగా ఉంటామని మంద కృష్ణ మాదిగ తెలిపారు.
తాజావార్తలు
-
Lock Upp 2: చావు బతుకుల్లో తోడున్నా.. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు.. కన్నీళ్ళు పెట్టుకున్న మోడల్
-
Indian Railways: RAC టికెట్కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
-
Cricket Legends: ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు.. ఈ ఐదుగురు స్పిన్నర్ల రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం!
-
Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా…! భర్తను లవర్తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?