Manda Krishna Madiga: ఎస్సీ రిజర్వేషన్ కు మీరు సపోర్ట్ ఇస్తే.. మేము అండగా ఉంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పై అభిప్రాయాలను తీసుకోవడానికి గాంధీభవన్ కు మంద కృష్ణ మాదిగ బృందం వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ నేతలతో మంద కృష్ణ సమావేశం అయ్యారు. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన వినతిపత్రాలు ఇచ్చారు.
Read Also: Gautham Adani: అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారం.. మరో 15 రోజులు గడువు కోరిన సెబీ
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మా ఆవేదన చెప్పడానికి గాంధీ భవన్ వచ్చాను అని తెలిపాడు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చిలికల సమస్య కాదు.. దళితుల మధ్య జరుగుతున్న అసమానతలు సరిద్దిద్దే ప్రయత్నం మాత్రమే అని ఆయన వెల్లడించారు. వర్గీకరణ అంశం.. సామాజిక అంశంగా గుర్తించిందే కాంగ్రెస్.. అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందటం లేదని లోకూర్ కమిటీని కాంగ్రెస్ వేసిందని మంద కృష్ణ అన్నారు. వర్గీకరణ అమలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సుప్రీంకోర్టు నిర్ణయంతో రద్దు అయ్యింది.. కానీ వర్గీకరణకి మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన పేర్కొన్నాడు.
Read Also: MP Laxman: తెలంగాణ విముక్తి కై బీజేపీ పోరాటం
ఎస్సీ వర్గీకరణకు కమిషన్లు వేసిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బిల్లు పెట్టలేదు అని మంద కృష్ణ అన్నారు.. బీజేపీ వర్గీకరణ చేస్తా అన్నది చెయ్యలేదు.. బీజేపీ మీద ఒత్తిడి పెంచండి అని రాహుల్ గాంధీని కలిశాను అని ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒత్తిడి పెంచండి అంటూ లేఖ ఇవ్వలేదు.. కనీసం తెలంగాణ ఎంపీలు కూడా వర్గీకరణ విషయం అడగలేదు.. కోమటిరెడ్డి, ఉత్తమ్ బయట మద్దతు ఇస్తున్నారు.. కానీ పార్లమెంట్లో కనీసం మాట్లాడలేదు అని మంద కృష్ణ మాదిగా అన్నారు.
మొన్న పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వర్గీకరణ విషయం ఎందుకు ప్రస్తావించలేదు అని ఆయన అడిగారు.
Read Also: Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు..!
మాకు లిప్ సింపతినేనా..? అసెంబ్లీలో కేసీఆర్ ని భట్టి కూడా అడగలేదు.. అలాంటప్పుడు మేము ఎలా మద్దతి ఇవ్వాలి అని మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సపోర్ట్ ఇస్తామని చెప్పాడు.. భవిష్యత్ కార్యచరణ ఉంటుంది అని మాట ఇచ్చారు.. వర్గీకరణకి మద్దతు ఇస్తే.. మేము అండగా ఉంటామని మంద కృష్ణ మాదిగ తెలిపారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!