Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో గొడవ.. స్నేహితుడి దారుణ హత్య
- దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం
- స్నేహితుడి దారుణ హత్య
- ఇద్దరు నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్పూర్లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు. గత నెల 31న గోపాల్పూర్ గ్రామ సమీపంలో గల క్వారీ గుంతలో రుద్రారం గ్రామానికి చెందిన బండమీది రమేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి స్నేహితులే నిందితులుగా గుర్తించారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన పర్సు ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేసినట్లు తెలిసింది.
Read Also: Wolf Attack : 200 మంది పోలీసులు, 18 మంది షూటర్లు… తోడేళ్ల అంతానికి భారీ ఆపరేషన్
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన నరేష్, సల్బతాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, బండమీది రమేష్ ముగ్గురు స్నేహితులు. ముగ్గురు తాండూరులో కలుసుకొని పెద్దేముల్లో మద్యం సేవించారు. అనంతరం పెద్దేముల్ తండాలోని కల్లు కాంపౌండ్లో 13 లిక్కర్ బాటిళ్లు చోరీ చేశారు. గోపాల్పూర్ పరిసరాల్లో 3 బాటిళ్లను సేవించి.. మిగతా బాటిళ్లను పంచుకుందామని అనుకున్నారు. రమేష్ తనకు మద్యం ఎక్కువగా తాగే అలవాటు ఉందని.. తనకు ఎక్కువ బాటిళ్లు కావాలని డిమాండ్ చేశాడు. లేకుంటే బాటిళ్లు దొంగతనం విషయం బయటపెడతానని హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం పెరిగి గొడవ పెద్దదైంది.
మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్, నరేష్లు ఇద్దరు కలిసి.. రమేష్ను బెల్టుతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న క్వారీ గుంతలో నీటిలో పడేశారు. రమేష్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం దగ్గర దొరికిన పర్సు ఆధారంగా శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారించగా..అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకడైన శ్రీకాంత్ గతంలో కారు అద్దాలు పగలగొట్టి కెమెరాను దొంగిలించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..