Wolf Attack : 200 మంది పోలీసులు, 18 మంది షూటర్లు… తోడేళ్ల అంతానికి భారీ ఆపరేషన్
- ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో నరమాంస భక్షక తోడేళ్ల భయం
- తోడేళ్ల అంతానికి భారీ ఆపరేషన్
- 200 మంది పోలీసులు.. 18 మంది షూటర్ల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో నరమాంస భక్షక తోడేళ్ల భయంతో ప్రజలు రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. తోడేళ్లు ఎప్పుడు, ఎక్కడ ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. ఈ నరమాంస భక్షకుల దాడిలో ఇప్పటివరకు 9 మంది చిన్నారులు సహా 10 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. మిగిలిన రెండు తోడేళ్లను పట్టుకునేందుకు పరిపాలన నిరంతరంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మాన్ ఈటర్లను పట్టుకునేందుకు అటవీ శాఖకు చెందిన 25 బృందాలు నిమగ్నమయ్యాయి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని 200 మంది పోలీసులను కూడా మోహరించారు. దీంతోపాటు పోలీసులు, అటవీశాఖ సంయుక్త బృందాలు రాత్రిపూట కూడా గస్తీ తిరుగుతున్నాయి. గ్రామస్తులు తమ పిల్లలను సురక్షితంగా ఉంచుకోవాలని, రాత్రి ఇళ్లకు తాళాలు వేసి లోపలే పడుకోవాలని సూచిస్తున్నారు.
READ MORE: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ ఆ జట్ల మధ్యే.. టీమిండియా మాజీ క్రికెటర్ జోస్యం
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
బహ్రైచ్ జిల్లాలోని మహసీ తహసీల్ ప్రాంతంలోని 35 గ్రామాల్లో తోడేళ్ల భయం ఉంది. ఆ గ్రామాల్లోని పిల్లలపై తోడేళ్లు దాడి చేశాయి. ఈ దాడిలో కొందరు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. అటవీ శాఖ ఈ ప్రాంతాన్ని మూడు సెక్టార్లు, ఒక రిజర్వ్ సెక్టార్గా విభజించింది. ఈ రంగాలకు ఇన్ఛార్జ్లను కూడా నియమించారు. తోడేళ్ళను ఎలా పట్టుకోవాలో ప్రణాళిక రూపొందించే బాధ్యతను వారికి అప్పగించారు. దీంతో పాటు గ్రామాల ప్రజల భద్రత కోసం 200 మంది పోలీసులను నియమించారు. దీంతో పాటు 18 మంది షార్ప్ షూటర్లు, 62 మంది అటవీ సిబ్బందిని కూడా మోహరించారు.
READ MORE:Minister Seethakka: విద్యార్థులే ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత
అటవీ శాఖ అధికారి ఏం చెప్పారు?
సెంట్రల్ జోన్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రేణు సింగ్ మాట్లాడుతూ.. “తోడేళ్లు పిల్లలను చంపే ప్రాంతాన్ని మ్యాప్ చేసి మూడు సెక్టార్లుగా విభజించాం. దీంతోపాటు ఒక సెక్టార్ను రిజర్వ్గా ఉంచాం. ఇందులో ఒక ఏసీఎఫ్ (ACF) ఇన్ఛార్జ్గా ఉన్నారు. దానిలో ఏదైనా సంఘటన గురించి సమాచారం అందితే, మేము వెంటనే థర్మల్ డ్రోన్లతో తోడేళ్ళను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాం. మేము వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..