Mamata Banerjee: ఏకపక్ష చర్చలు సరికాదు.. ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ
- ప్రధాని మోడీకి సీఎం మమతా బెనర్జీ లేఖ
- తీస్తా నదీ జలాల పంపిణీపై ఇటీవల చర్చలు
- తనను సమావేశానికి ఆహ్వానించనందుకు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య చర్చలకు తనను ఆహ్వానించనందుకు ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపకంపై చర్చలపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోల్కతా-ఢాకా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని సీఎం మమతా బెనర్జీ హైలైట్ చేస్తూ.. “సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష చర్చలు ఆమోదయోగ్యం కాదు” అని ఆమె పేర్కొన్నారు. గంగా నది, తీస్తా నది జలాల షేరింగ్ అంశంపై ఇటీవల ప్రధాని షేక్ హసీనా, మోదీ మధ్య చర్చలు జరిగాయి.
CM Chandrababu: రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ
Also Read
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
పీఎం మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య ఇటీవల జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో.. తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ.. 1996 గంగా జల ఒప్పందాన్ని పునరుద్ధరించడంపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ’పై చర్చించేందుకు సాంకేతిక బృందం త్వరలో బంగ్లాదేశ్ను సందర్శిస్తుందని చెప్పారు. అయితే.. ఫరక్కా బ్యారేజీ కోత, పూడిక, వరదలకు కారణమైందని టీఎంసీ ఆరోపిస్తుంది. కాగా.. నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా సర్కార్ చాలా కాలంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో.. ఈ భేటీపై మమతా బెనర్జీ మండిపడ్డారు.
Robert vadra: వయనాడ్లో ప్రియాంక పోటీపై రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!
ఇటువంటి ఒప్పందాల ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని మమతా బెనర్జీ లేఖలో ప్రస్తావించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఫరక్కా ఒప్పందాన్ని రెన్యువల్ చేయాలన్న ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దాని వల్ల పశ్చిమ బెంగాల్పై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె తన లేఖలో తెలిపారు.
తాజావార్తలు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!