Mamata Banerjee: ఏకపక్ష చర్చలు సరికాదు.. ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ
- ప్రధాని మోడీకి సీఎం మమతా బెనర్జీ లేఖ
- తీస్తా నదీ జలాల పంపిణీపై ఇటీవల చర్చలు
- తనను సమావేశానికి ఆహ్వానించనందుకు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య చర్చలకు తనను ఆహ్వానించనందుకు ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపకంపై చర్చలపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోల్కతా-ఢాకా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని సీఎం మమతా బెనర్జీ హైలైట్ చేస్తూ.. “సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష చర్చలు ఆమోదయోగ్యం కాదు” అని ఆమె పేర్కొన్నారు. గంగా నది, తీస్తా నది జలాల షేరింగ్ అంశంపై ఇటీవల ప్రధాని షేక్ హసీనా, మోదీ మధ్య చర్చలు జరిగాయి.
CM Chandrababu: రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ
Also Read
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
పీఎం మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య ఇటీవల జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో.. తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ.. 1996 గంగా జల ఒప్పందాన్ని పునరుద్ధరించడంపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ’పై చర్చించేందుకు సాంకేతిక బృందం త్వరలో బంగ్లాదేశ్ను సందర్శిస్తుందని చెప్పారు. అయితే.. ఫరక్కా బ్యారేజీ కోత, పూడిక, వరదలకు కారణమైందని టీఎంసీ ఆరోపిస్తుంది. కాగా.. నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా సర్కార్ చాలా కాలంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో.. ఈ భేటీపై మమతా బెనర్జీ మండిపడ్డారు.
Robert vadra: వయనాడ్లో ప్రియాంక పోటీపై రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!
ఇటువంటి ఒప్పందాల ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని మమతా బెనర్జీ లేఖలో ప్రస్తావించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఫరక్కా ఒప్పందాన్ని రెన్యువల్ చేయాలన్న ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దాని వల్ల పశ్చిమ బెంగాల్పై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె తన లేఖలో తెలిపారు.
తాజావార్తలు
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!