CM Chandrababu: రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం వైపు వేగంగా అడుగులు
- అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ సచివాలయంలో సమావేశం అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- పాల్గొన్న మంత్రి నారాయణ.. నిర్మాణ కంపెనీల ప్రతినిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.. గతంలో ఉన్న టెండర్ల కాలపరిమితి ముగియడంతో ఆయా కంపెనీలతో మళ్లీ చర్చలు జరుపుతోంది కూటమి ప్రభుత్వం.. మధ్యలో నిలిచిపోయిన పనులు కొనసాగించే అంశంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగుతోంది..
Read Also: CM Revanth Reddy: కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటనలపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు.. మొదట పోలవరం.. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించారు.. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు.. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందన్నారు. ఏపీ అనగా ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని, అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందన్నారు. పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని, ఈ రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసిందని విమర్శించారు. విభజిత ఏపీ, ఉమ్మడి ఏపీలో ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదన్నారు. ఇక, అమరావతి ప్రజా రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని అంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలును మోడల్ సిటీగా మారుస్తామన్నారు. రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పామని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!