CM Chandrababu: రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం వైపు వేగంగా అడుగులు
- అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ సచివాలయంలో సమావేశం అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- పాల్గొన్న మంత్రి నారాయణ.. నిర్మాణ కంపెనీల ప్రతినిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.. గతంలో ఉన్న టెండర్ల కాలపరిమితి ముగియడంతో ఆయా కంపెనీలతో మళ్లీ చర్చలు జరుపుతోంది కూటమి ప్రభుత్వం.. మధ్యలో నిలిచిపోయిన పనులు కొనసాగించే అంశంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగుతోంది..
Read Also: CM Revanth Reddy: కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Also Read
- Dharmendra Pradhan: విద్యార్థి నాయకుడి నుంచి కేంద్ర మంత్రి వరకు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్థానం ఇదే..
- Dharmendra Pradhan: దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ రియాక్షన్..
- Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటనలపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు.. మొదట పోలవరం.. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించారు.. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు.. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందన్నారు. ఏపీ అనగా ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని, అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందన్నారు. పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని, ఈ రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసిందని విమర్శించారు. విభజిత ఏపీ, ఉమ్మడి ఏపీలో ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదన్నారు. ఇక, అమరావతి ప్రజా రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని అంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలును మోడల్ సిటీగా మారుస్తామన్నారు. రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పామని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: విద్యార్థి నాయకుడి నుంచి కేంద్ర మంత్రి వరకు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్థానం ఇదే..
-
Dharmendra Pradhan: దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ రియాక్షన్..
-
Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
-
Chennai Love Story: ‘బేబీ’ని మించిన హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
-
Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!