Lok Sabha Elections 2024: పాలమూరు నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్.. గంట తేడాతో సీఎం, పీఎం సభలు
నారాయణపేట జిల్లా పై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనబోతోంది. గంట తేడాతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరుకానున్నారు. జిల్లా పరిధిలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి రానుండగా.. జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసి బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ రెండు బహిరంగ సభలు కేవలం గంట తేడాతో జరగనుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయపరమైన ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంటుంది.
READ MORE: Virat Kohli Six: విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండ్ సిక్సర్.. వీడియో వైరల్!
Also Read
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
ఎన్నికల ప్రచారాలలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఒకే జిల్లా.. ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో గంట తేడాతో దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని బహిరంగ సభలు జరుగుతూ ఉండటం ఉమ్మడి పాలమూరు జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీల నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తోంది. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీలో బరిలో నిలిచారు. కాగా, నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించనున్న బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. మక్తల్లో నిర్వహించే సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
ఒక గంట తేడాతో పక్కపక్కన ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలను నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో జన సమీకరణ చేయడం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు కత్తి మీద సాముల మారింది. ప్రధానమంత్రి సభకు గానీ, ముఖ్యమంత్రి సభకు గానీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి తమ సత్తా చాటుకోవాలని నాయకులు భావిస్తున్నారు. ఈ సభలు పోలీసులకు తలనొప్పిగా మారింది. భారీ ఎత్తున వచ్చే జనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, సమావేశం జరుగుతున్నప్పుడు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలు పోలీసు యంత్రాంగానికి సవాల్గా మారుతున్నాయి. పీఎం, సీఎం సభలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!