Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి కారణం అదే..
- బడుగు బలహీనర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
- రానున్న ఎన్నికల్లో ఆరె కటికలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం
- కాంగ్రెస్ పార్టీ ఆరె కటికలకు అండగా ఉంటుంది
- ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఆరె కటికలు ఎదగాలి
- భవిష్యత్ తెలంగాణ బీసీలదే
- టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడుగు బలహీనర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు.” కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరె కటికల పాత్ర ఉంది. బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడొ యాత్ర చేపట్టారు. బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని కుల సర్వే జరగాలనేది రాహుల్ గాంధీ ఆశయం. కుల సర్వే తో బీసీల గుండెల్లో రాహుల్ గాంధీ గారు చిర స్థాయిగా నిలిచిపోతారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు రేవంత్ ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించింది. రానున్న ఎన్నికల్లో ఆరె కటికలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆరె కటికలకు అండగా ఉంటుంది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఆరె కటికలు ఎదగాలి. భవిష్యత్ తెలంగాణ బీసీలదే. 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్దత కోసం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది.” అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
READ MORE: Narendra Modi : భోజ్ పురిలో మాట్లాడిన మోడీ.. ఆ వంటకం గురించి స్పెషల్ కామెంట్
Also Read
పదేళ్ల పాలనలో కేసిఆర్ ప్రభుత్వం బీసీ లకు చేసిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. “కాంగ్రెస్ పాలనలో బీసీలకు సువర్ణ అధ్యాయం. బీసీలు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. పదేళ్లలో కేసిఆర్ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మాటకు కట్టుబడి ఒక్కొకటిగా అమలు చేస్తుంది. ఆరె కటిక కార్పొరేషన్ కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నా. ఆరె కటికలను BC -D నుంచి BC- A డిమాండ్ పై చర్చిస్తాం. బీసీ బిడ్డ బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి..లాక్కుంది ఎవరు? తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే కుల సర్వేకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని అడగగలరా? దేశ వ్యాప్తంగా జన గణన తో పాటు కుల సర్వే చేయాలని అడిగే ధైర్యం బండి సంజయ్ కి ఉందా? ” అని మహేష్కుమార్ గౌడ్ ప్రశ్నించా
తాజావార్తలు
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!