Mahesh Babu: దట్ ఈజ్ మహేష్.. అభిమాని పిల్లల్ని దత్తత తీసుకోని ఆపై..
- తన అభిమానులు కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే అండగా మహేష్
- వీరాభిమాని రాజేష్ ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్ అయి చావు బతుకుల మధ్య పోరాటం.
- అభిమాని ముగ్గురి పిల్ల చదువుల బాధ్యత తీసుకున్న మహేష్.
- సోషల్ మీడియాలో మహేష్ పై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకునేలా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించడం, అలాగే కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం లాంటి అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి 1000 మందికి పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేయించారు. అంతేకాదు మహేష్ బాబు తన అభిమానులు ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ., ఏదైనా కష్టాల్లో ఉన్న కానీ.. మహేష్ వెంటనే స్పందిస్తాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన వీరాభిమానికి అండగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Vangalapudi Anitha: పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకొండి.. పోలీసులకు హోం మంత్రి వార్నింగ్
Also Read
మోపిదేవి పెదప్రోలులో కాకర్లపూడి రాజేష్ అని వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమాని. ఆయనకి ఓ భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేష్ కు మహేష్ బాబు పై ఎంత అభిమానం అంటే తన ముగ్గురు కుమారులకు కూడా మహేష్ బాబు నటించిన సినిమా పేర్లను పెట్టేసాడు. రాజేష్ మొదటి కొడుకు పేరు అర్జున్, రెండో కొడుకు పేరు అతిథి, మూడో కొడుకు పేరు ఆగడు. ఇలా ఏ సినిమా రిలీజ్ సమయంలో కొడుకు పుట్టినట్లయితే అందుకు సంబంధించిన పేరును నామకరణం చేసేసాడు. అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ అభిమాని రాజేష్ ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్ సంబంధించిన వ్యాధితో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిది పేద కుటుంబం కావడంతో తన ముగ్గురు కొడుకులు చదువు మానేసి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
T20 World Cup 2024: ‘సూపర్ 8’ భారత్ షెడ్యూల్ ఇదే!
ఇందులో పెద్దకొడుకు చెప్పుల షాపులో పనిచేస్తుండగా.. మరో ఇద్దరు కుమారులు వేరే పనులలో ఉన్నారు. అయితే ఈ విషయంపై ఇదివరకు ఆ పిల్లలు చదివిన పాఠశాల ప్రిన్సిపల్ మహేష్ బాబు అభిమానులకు ఈ విషయాన్ని తెలిపారు. దాంతో ఆ విషయం కాస్త మహేష్ బాబు వద్దకు చేరడంతో., మహేష్ బాబు ఫౌండేషన్ టీం ద్వారా సభ్యులు పెద్దప్రోలుకు వెళ్లి అక్కడ రాజేష్ పిల్లలను మోపిదేవిలోని ఓ పాఠశాలలో జాయిన్ చేయించి డబ్బులు కట్టారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వారి చదువుకు అవసరమయ్యే డబ్బులు మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి వస్తాయని., వాళ్ళని పూర్తిగా చదివిస్తామని చెప్పినట్లు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో మరోసారి మహేష్ బాబును సోషల్ మీడియాలో అభిమానులు, అలాగే నెటిజెన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!