Pakistan: పాక్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. భారత్ నుంచి యాత్రికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62 మంది హిందువులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి బుధవారం నాడు మొత్తం 62 మంది హిందూ యాత్రికులు లాహోర్ చేరుకున్నారని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ప్రతినిధి అమీర్ హష్మీ తెలిపారు. లాహోర్కు 300 కిలోమీటర్ల దూరంలోని చక్వాల్లోని చారిత్రాత్మక కటాస్ రాజ్ ఆలయంలో మార్చి 9న ఈటీపీబీ నిర్వహిస్తున్న మహాశివరాత్రి ప్రధాన కార్యక్రమం జరుగుతుందని, ఇందులో వివిధ రాజకీయ, సామాజిక, మత పెద్దలు హాజరవుతారని అమీర్ హష్మీ తెలిపారు.
Read Also: Bomb Alert : ముంబై టు బెంగళూరు విమానంలో బాంబు.. భార్య కోసం అబద్ధం చెప్పిన భర్త
Also Read
- Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- Jupally Krishna Rao: "లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా".. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
విశ్వనాథ్ బజాజ్ నేతృత్వంలో వచ్చిన హిందువులకు వాఘా వద్ద ధార్మిక స్థలాల అదనపు కార్యదర్శి రాణా షాహిద్ సలీమ్ స్వాగతం పలికారు. యాత్రికులు మార్చి 10న లాహోర్కు తిరిగి వస్తారు. మార్చి 11న లాహోర్లోని కృష్ణ దేవాలయం, లాహోర్ కోట, ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మార్చి 12న భారత్కు తిరిగి రానున్నారు. పాకిస్తాన్లోని కటాస్రాజ్ ఆలయానికి తీర్థయాత్రకు బయలుదేరే ముందు, భక్తులు బుధవారం అమృత్సర్లోని దుర్గియానా ఆలయాన్ని సందర్శించారు. మార్చి 6 నుంచి 12 వరకు పంజాబ్లోని చక్వాల్ జిల్లాలో ఉన్న కటాస్ రాజ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారతీయ హిందూ యాత్రికులకు పాకిస్థాన్ హైకమిషన్ వీసాలు జారీ చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!