ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచారామ క్షేత్రాలతో పాటు ప్రముఖ శైవ ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా కోటప్పకొండ, అమరావతి, దైద క్వారీ , గోవాడ వంటి క్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం అధికారులు ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఏర్పాట్లు చేపట్టారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వెలసిన త్రికోటేశ్వర…
శివ భక్తులకు, మహాశివరాత్రిని సంవత్సరంలో అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండుగగా పరిగణిస్తారు. మహాశివరాత్రి ఉపవాసం శివుడికి అంకితం. ఈ రోజున ఉపవాస నియమాలను సరిగ్గా పాటించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఉపవాస సమయంలో, ఉపవాసం పూర్తి ప్రయోజనాలను నిర్ధారించడానికి కొన్ని ఆహార పరిమితులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మహాశివరాత్రి ఉపవాస సమయంలో ఏమి తినాలో, ఏమి తినకూడదో తెలుసుకోండి. Also Read:Bangladesh: భారత సరిహద్దుల్లో “జమాత్” విజయం.. చికెన్స్ నెక్, ఈశాన్యానికి ప్రమాదం.. మహాశివరాత్రి ఉపవాసంలో ఏమి…
రేపే మహాశివరాత్రి. శివభక్తులు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనదిగా, పవిత్రంగా భావిస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. శివ పూజలకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఓం నమః శివాయ నామస్మరణతో ఆలయాలు మార్మోగనున్నాయి. ఈ పవిత్రమైన రోజున చాలా మంది భక్తుు నిర్జల ఉపవాసం పాటిస్తారు, రాత్రంతా మేల్కొని ఉంటారు. Also Read:Sree Vishnu: శ్రీవిష్ణు Vs శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ వద్ద నాతో నాకే పోటీ అంటున్న యువ హీరో! భక్తి…
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళంలో తాను మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు క్షమాపణలు కోరారు.
మహా శివరాత్రి.. దేశంలోనే అతిపెద్ద పండుగ. శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో గడుపుతారు. మొత్తం నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు. ఇంట్లోనే శివలింగం ప్రతిష్టించి అభిషేకం చేసుకొని పూజ జరిపించుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు.
మహా శివరాత్రి ఉత్సవాలకు భక్తులు సిద్ధమవుతున్నారు. పరమ శివున్ని ప్రసన్నం చేసుకునేందుకు శివయ్య భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే శివాలయాలను పూలు, మామిడాకుల తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. మహా శివరాత్రి వేళ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగనున్నాయి. భక్తులు ఉపవాసాలు, జాగారాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు శివయ్యపై తమ భక్తిని వినూత్నరీతిలో చాటుకుంటున్నారు. ఇదే రీతిలో గుజరాత్ లోని భక్తులు శివలింగాన్ని రుద్రాక్షలతో రూపొందించారు. వందలు,వేలు కాదు ఏకంగా…
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రీ సేల్ బుకింగ్స్లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే.. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో.. రష్మిక హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి. Also…
శివరాత్రి 2025ను పురస్కరించుకుని ప్రత్యేక పాటను ఆవిష్కరించింది వనిత టీవీ.. "దేవ దేవ శంకర దేవ శంభో శంకరా.. దేవులాడినేడదొరకవా..! ఆది ఆది శంకరా యాడతిరుగుతున్నవు.. జాడతెల్వకున్నవేందిరా..!! నిప్పుగాని నిప్పువు.. నీడగాని నీడవు.. మూఠలేని ముల్లెవు ఏ మిచ్చినా ఒల్లవు..!!! అన్ని ఉండి ఏమీ లేని అదిభిక్షువున్నవు..!!! అంటూ ప్రముఖ రచయిత, సింగర్ గోరేటి వెంకన్న రాయడంతో పాటు తన గొంతు సవరించారు..
Minister Anam: శ్రీశైలంలో మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.. ఈనెల 25, 26 రెండు రోజులు శ్రీశైలం టోల్ గేట్లు ఉచితం చేస్తాం..
Mahashivratri: రాజస్థాన్ కోటాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరుపుతున్న ఊరేగింపులో ప్రమాదం జరిగింది. ఉరేగింపు సమయంలో 14 మంది చిన్నారులు విద్యుత్ షాక్కి గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. గాయపడిన చిన్నారుల్ని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. కొంత మంది చిన్నారులను అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.