Assembly Sessions: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పటిష్ట భద్రత ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి నాగ్పూర్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భద్రత కోసం 11,000 మంది పోలీసులు, 40 బాంబ్ స్క్వాడ్లు, 10 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ఇతర భద్రతా దళాలు మోహరించనున్నారు. 14 రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నాయి.
Smriti Irani: భారత్లో సౌదీ అరేబియా మంత్రి పర్యటన.. హజ్ యాత్రపై స్మృతి ఇరానీ చర్చ
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
సమావేశాలకు ముందు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్, జాయింట్ కమిషనర్ అశ్వతీ దోర్జే సోమవారం పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధాన్ భవన్ చుట్టూ సాయుధ పోలీసులను వ్యూహాత్మకంగా మోహరిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం.. 11,000 మంది పోలీసులు, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF) యొక్క 10 కంపెనీలు, 1,000 మంది హోంగార్డులు, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ ఫోర్స్ వన్, 40 బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్లు (BDDS) రాష్ట్ర శాసనసభ రక్షణగా ఉంటారు. అంతేకాకుండా.. 9 మంది డీఎస్పీ స్థాయి అధికారులను నియమించనున్నారు.
INDIA bloc: ఇండియా కూటమి మీటింగ్ తేదీ ఖరారు.. వెల్లడించిన లాలూ..
ఇదిలా ఉంటే.. తొమ్మిది మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ర్యాంక్ అధికారులు, ఇతర జిల్లాల నుండి 10 మంది అధికారులను నగరంలో మోహరించనున్నారు. ఈ క్రమంలో.. 50 మంది అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, 75 ఇన్స్పెక్టర్లు, 20 మంది మహిళా ఇన్స్పెక్టర్లను నాగ్పూర్కు పిలిపించారు. కాగా.. వీఐపీల భద్రత కోసం పోలీసులతో పాటు జిల్లాల నుంచి 30 బాంబ్ స్క్వాడ్లు, 10 మంది నగర పోలీసు బలగాలను బందోబస్తులో భాగంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే.. నాగ్ పూర్ లో మోర్చా నిర్వహించేందుకు 32 సంస్థలకు అనుమతి లభించిందని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 100 దాటుతుందని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఇంత భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!