Smriti Irani: భారత్లో సౌదీ అరేబియా మంత్రి పర్యటన.. హజ్ యాత్రపై స్మృతి ఇరానీ చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్-రబియా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఈరోజు భారత కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియాను కలిశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడామన్నారు. అంతేకాకుండా.. హజ్ యాత్రను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై కూడా చర్చించామని తెలిపారు.
INDIA bloc: ఇండియా కూటమి మీటింగ్ తేదీ ఖరారు.. వెల్లడించిన లాలూ..
Also Read
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
అంతేకాకుండా.. అంగన్వాడీ కేంద్రాలు ఎలా హైటెక్గా మారుతున్నాయో, టెక్నాలజీ ఎలా పనిని సులభతరం చేసిందో స్మృతి ఇరానీ వివరించారు. సాంప్రదాయ బొమ్మలు, లాలిపాటల ద్వారా చిన్న పిల్లలకు విద్యాబోధన చేయడం ఎందుకు ముఖ్యమో.. స్మృతి ఇరానీ తెలిపారు. సాంకేతికత, భారతీయ సంప్రదాయం సహాయంతో అంగన్వాడీ కేంద్రాలు పిల్లలను తీర్చిదిద్దుతున్నాయని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. మరోవైపు.. హజ్ 2023ను విజయవంతం చేసినందుకు సౌదీ అరేబియాకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ కృతజ్ఞతలు తెలిపారు. హజ్ 2024ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్-రబియా భారతదేశ పర్యటన ముఖ్యమని ఆయన అన్నారు.
Aata Sandeep: యానిమల్ లో రణబీర్ ఎంట్రీ.. ఆ స్టెప్స్ నేనే నేర్పించా
కాగా.. తాను ఇండియా పర్యటన సందర్భంగా సాదర స్వాగతం పలికినందుకు అల్-రబియా ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియా చాలా చేసిందని అన్నారు. 48 గంటల్లో వీసా పొందవచ్చని.. ఉమ్రా వీసా 90 రోజులు చెల్లుబాటు అవుతుందని తెలిపారు. మరో 3 వీసా కేంద్రాలపై చర్చ జరిగిందని.. అంతేకాకుండా తాము సవాళ్లను అధిగమించడం గురించి చర్చించాము.. విమానాల పెంపుపై కూడా దృష్టి సారించామన్నారు. హజ్ యాత్రపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఇప్పటికే హజ్ 2024 విధానాన్ని సమర్పించిందని, హజ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులందరికీ దరఖాస్తు ఫారమ్ అందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం హాజీలలో 47% మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
-
Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!