MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై ఫిక్సింగ్ ఆరోపణలు.. ఐపీఎస్ అధికారికి 15 రోజుల జైలు శిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో 2013 సీజన్ సమయంలో ఫిక్సింగ్, బెట్టింగ్ కు పాల్పడినట్లు ఓ ఐపీఎల్ అధికారి ఆరోపణలు చేశాడు. అయితే, ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు నిర్థారణ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల నిషేధం విధించారు. ఆ టైంలో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ నేతృత్వంలో విచారణ సాగింది. అయితే సంపత్ కుమార్ కొందరు బుకీల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆ అధికారిని కేసు విచారణ బాధ్యతల నుంచి ఉన్నతాధికారులు తప్పించారు. దీంతో బుకీల నుంచి సంపత్ కుమార్ లంచం తీసుకున్నట్టు ఆధారాలు లేవంటూ ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ అతడికి ఊరట లభించింది.
Read Also: Bussiness Idea : రోజుకు రెండు గంటలు కష్టపడితే చాలు.. లక్షల్లో ఆదాయం…
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
కానీ, సదరు ఐపీఎస్ అధికారి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహేంద్ర సింగ్ ధోనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఓ టీవీ చానల్లో సంపత్ కుమార్ మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టుకు ధోని తెలిపాడు. ఆ మేరకు సదరు టీవీ ఛానల్ పైనా, ఐపీఎస్ అధికారిపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశాడు ధోనీ.. అంతేకాదు, తాను అడిగే 17 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తన పిటిషన్ లో అతడు పేర్కొన్నారు.
Read Also: No More Secrets: ‘నో మోర్ సీక్రెట్స్’ అంటూ లిప్లాక్తో రెచ్చిపోయిన జ్యోతి రాయ్!
ఇక, మహేంద్ర సింగ్ ధోనీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ టీవీ ఛానల్ తో పాటు సంపత్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే సదరు టీవీ ఛానల్ ఇచ్చిన వివరణపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ధోనీ లాంటి ప్రముఖ క్రికెటర్ పై ఏదైనా వార్తలు ప్రసారం చేసే ముందు వాటిని నిర్ధారించుకోవాలని ఆ టీవీ ఛానల్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో పాటు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ వివరణ ధోనీ కోపాన్నీ తగ్గించలేకపోయింది. పైగా ఆయన ఇచ్చిన వివరణ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాడంటూ ధోనీ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. ధోనీ పిటిషన్ పై ఇవాళ విచారణ చేసిన హైకోర్టు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే అతడు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజులు నిలిపివేసింది.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?