Man Hires Killer: ఎంత దుర్మార్గం.. ఆ డబ్బు కోసం కక్కుర్తి పడిన కొడుకు ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Hires Killer: రాను రాను సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. పొరుగు సంబంధాల గురించి దేవుడెరుగు.. రక్త సంబంధాలే రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతున్నాయి. బంధాల కంటే డబ్బుపైనే ప్రేమ పెంచుకుంటున్నారు. అది ఎంతలా అంటే పదవి కోసం, డబ్బు కోసం ఏకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులనే హతమార్చేంతటి దారుణమైన ఘోరానికి పాల్పడుతున్నారు. ఇక వివరాల్లోకి వస్తే ప్రమాద బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవడానికి ఓ వ్యక్తి కన్నతండ్రినే చంపేందుకు కూడా వెనకాడలేదు. బీమా డబ్బు కోసం సొంత తండ్రిని హత్య చేసేందుకు మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కిరాయి హంతకుడిని నియమించుకున్నాడు. ఓ వాహనంతో వెనుక నుంచి ఢీకొట్టేలా పథకాన్ని కూడా రచించాడు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. హత్యగా నిర్ధారించారు.
మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలో ఒక వ్యక్తి తన ప్రమాద బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవడానికి తన తండ్రిని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నాడని పోలీసులు శనివారం తెలిపారు.తన 52 ఏళ్ల తండ్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చనిపోయాడని పేర్కొంటూ నిందితుడు నవంబర్ 10న సెంద్వా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో మరణం వెలుగులోకి వచ్చిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దీపక్ కుమార్ శుక్లా తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యకేసుగా నిర్ధారించారని తెలిపారు. బాధితుడిని ఢీకొన్న వాహనం స్థానికంగా తిరుగుతున్నట్లు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో తేలిందని సెంద్వా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజేష్ యాదవ్ తెలిపారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
USA: మోదీకి మినహాయింపు ఇచ్చినట్లే సౌదీ యువరాజుకు కూడా మినహాయింపు..
బాధితుడికి రోజూ ఉదయం వాకింగ్కు వెళ్లే అలవాటు ఉంది. నవంబర్ 10న, నిందితుడు తన తండ్రి మార్నింగ్ వాక్కు వెళ్లాడని కాంట్రాక్ట్ కిల్లర్కు ఫోన్ చేసి చెప్పాడని తెలిపారు. దర్యాప్తు తరువాత, అనుమానితులలో ఒకరైన కరణ్ షిండేను పుణె నుంచి అరెస్టు చేశారు. విచారణలో, హత్యకు ₹ 2.5 లక్షలు ఇస్తానని బాధితురాలి కుమారుడు వాగ్దానం చేసినట్లు అతను చెప్పాడు. బాధితుడి కుమారుడు తన తండ్రికి రూ.10 లక్షలకు ప్రమాద బీమా తీసుకున్నాడని, హంతకులను నియమించాడని విచారణలో అంగీకరించాడు. ఈ నేరంలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!