IPL 2025: రోహిత్ శర్మ కోసం రూ. 50 కోట్లు.. సంజీవ్ గోయెంకా ఏమన్నారంటే..!
- రోహిత్ శర్మ కోసం రూ. 50 కోట్లు..
- ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సమాధానం
- రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడని ఎవరికైనా తెలుసా?..- గోయెంకా
- రోహిత్ను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేస్తుందో.. లేదో కూడా తెలియదు- గోయెంకా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 కోసం ఈ సంవత్సరం మెగా వేలం ఉండవచ్చు. ప్రస్తుతం వేలానికి సంబంధించిన నిబంధనల గురించి బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్లో మెగా వేలం జరిగినప్పుడు ఏ జట్టు అయినా పూర్తిగా రిటైన్ చేయాల్సిందే. కానీ.. గతసారి మెగా వేలంలో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతి లభించింది. అయితే ఈసారి ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాల్సింది ఇంకా ఖరారు కాలేదు. రైట్ టు మ్యాచ్ కార్డ్తో సహా మొత్తం ఆరుగురు ఆటగాళ్లను జట్టు అట్టిపెట్టుకోగలదని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అందరి దృష్టి ముంబై ఇండియన్స్పైనే ఉంది. తమ వద్ద చాలా మంది ఆటగాళ్లు రిటైన్ కావాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టిమ్ డేవిడ్.. రోహిత్ శర్మ వంటి చాలా మంది స్టార్లు ఉన్నారు. ఈ క్రమంలో ఫ్రాంచైజీ రోహిత్ను రిటైన్ చేస్తుందా లేదా అనే సమాచారం ఇంకా తెలియదు.
Pilli Subhash Chandra Bose: వైసీపీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదు.. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్తోనే!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ముంబై ఇండియన్స్తో హిట్మ్యాన్ వివాదం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ఫ్రాంచైజీ అతన్ని కెప్టెన్గా తొలగించింది. ఈ క్రమంలో.. హార్దిక్ పాండ్యాను జట్టుకు కొత్త కెప్టెన్గా నియమించింది. దీంతో.. రోహిత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా తీవ్రంగా విమర్శించారు. అయితే.. రోహిత్ బ్రాండ్ వాల్యూను పరిగణనలోకి తీసుకుంటే, అతను వేలంలోకి వస్తే.. కొనుగోలు చేసేందుకు చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) జట్లలో ఆరు కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను (మ్యాచ్ హక్కుతో సహా) ఉంచుకోవడానికి అనుమతించకపోవచ్చు. ఈ క్రమంలో.. రోహిత్ తదుపరి సీజన్లో కొత్త జట్టుకు ఆడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. కాగా.. లక్నో జట్టు ఓనర్ గోయెంకా ఆ పుకార్లను ఖండించారు. స్పోర్ట్స్ టాక్లో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ వేలానికి వస్తున్నాడో లేదో ఎవరికీ తెలియదు. అసలు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ విడుదల చేస్తుందా అనేది కూడా తెలియదు. ఒకవేళ వేలంలోకి వస్తే.. ఒక్క ఆటగాడి కోసం 50 శాతం వెచ్చించాల్సి ఉంటుంది. మరీ మిగతా ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తాం’ అని పేర్కొన్నారు. తమ జట్టులో అత్యుత్తమ ఆటగాడు, అత్యుత్తమ కెప్టెన్ కావాలి అనే కోరిక ప్రాంఛైజీకి ఉంటుందని చెప్పారు. అలాగే.. ఆ కోరిక అన్ని ఫ్రాంచైజీలకు ఉంటుంది.. అలాగని ప్రతిఒక్కరినీ తీసుకోవడమూ కుదరదని గోయెంకా వెల్లడించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!