IPL 2025: రోహిత్ శర్మ కోసం రూ. 50 కోట్లు.. సంజీవ్ గోయెంకా ఏమన్నారంటే..!
- రోహిత్ శర్మ కోసం రూ. 50 కోట్లు..
- ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సమాధానం
- రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడని ఎవరికైనా తెలుసా?..- గోయెంకా
- రోహిత్ను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేస్తుందో.. లేదో కూడా తెలియదు- గోయెంకా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 కోసం ఈ సంవత్సరం మెగా వేలం ఉండవచ్చు. ప్రస్తుతం వేలానికి సంబంధించిన నిబంధనల గురించి బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్లో మెగా వేలం జరిగినప్పుడు ఏ జట్టు అయినా పూర్తిగా రిటైన్ చేయాల్సిందే. కానీ.. గతసారి మెగా వేలంలో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతి లభించింది. అయితే ఈసారి ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాల్సింది ఇంకా ఖరారు కాలేదు. రైట్ టు మ్యాచ్ కార్డ్తో సహా మొత్తం ఆరుగురు ఆటగాళ్లను జట్టు అట్టిపెట్టుకోగలదని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అందరి దృష్టి ముంబై ఇండియన్స్పైనే ఉంది. తమ వద్ద చాలా మంది ఆటగాళ్లు రిటైన్ కావాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టిమ్ డేవిడ్.. రోహిత్ శర్మ వంటి చాలా మంది స్టార్లు ఉన్నారు. ఈ క్రమంలో ఫ్రాంచైజీ రోహిత్ను రిటైన్ చేస్తుందా లేదా అనే సమాచారం ఇంకా తెలియదు.
Pilli Subhash Chandra Bose: వైసీపీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదు.. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్తోనే!
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
ముంబై ఇండియన్స్తో హిట్మ్యాన్ వివాదం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ఫ్రాంచైజీ అతన్ని కెప్టెన్గా తొలగించింది. ఈ క్రమంలో.. హార్దిక్ పాండ్యాను జట్టుకు కొత్త కెప్టెన్గా నియమించింది. దీంతో.. రోహిత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా తీవ్రంగా విమర్శించారు. అయితే.. రోహిత్ బ్రాండ్ వాల్యూను పరిగణనలోకి తీసుకుంటే, అతను వేలంలోకి వస్తే.. కొనుగోలు చేసేందుకు చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) జట్లలో ఆరు కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను (మ్యాచ్ హక్కుతో సహా) ఉంచుకోవడానికి అనుమతించకపోవచ్చు. ఈ క్రమంలో.. రోహిత్ తదుపరి సీజన్లో కొత్త జట్టుకు ఆడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. కాగా.. లక్నో జట్టు ఓనర్ గోయెంకా ఆ పుకార్లను ఖండించారు. స్పోర్ట్స్ టాక్లో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ వేలానికి వస్తున్నాడో లేదో ఎవరికీ తెలియదు. అసలు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ విడుదల చేస్తుందా అనేది కూడా తెలియదు. ఒకవేళ వేలంలోకి వస్తే.. ఒక్క ఆటగాడి కోసం 50 శాతం వెచ్చించాల్సి ఉంటుంది. మరీ మిగతా ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తాం’ అని పేర్కొన్నారు. తమ జట్టులో అత్యుత్తమ ఆటగాడు, అత్యుత్తమ కెప్టెన్ కావాలి అనే కోరిక ప్రాంఛైజీకి ఉంటుందని చెప్పారు. అలాగే.. ఆ కోరిక అన్ని ఫ్రాంచైజీలకు ఉంటుంది.. అలాగని ప్రతిఒక్కరినీ తీసుకోవడమూ కుదరదని గోయెంకా వెల్లడించారు.
తాజావార్తలు
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!