Real Drushyam 2 : ఇది రియల్ దృశ్యం.. డ్యాములో మునిగిన కారు.. లేచిపోయిన బావామరదళ్ళ అస్థిపంజరాలు లభ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lovers’ Skeletons Found Inside A Floating Car In Kuwari River: మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్ హీరోలుగా నటించిన దృశ్యం 2 సినిమాలోని ఒక సీన్ రిపీట్ అయింది. ఈ సినిమాలో కారును ఒక నీటి సంపులో దాస్తాడు హీరో. చాలా కాలానికి ఆ కారు బయటపడుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో అలాంటిదే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. మొరెనా జిల్లాలో ఒక స్టాప్ డ్యామ్లో మునిగిన కారులో నుండి ఒక వివాహిత, ఆమె బావమరిది ఛిద్రమైన మృతదేహాలు(అస్థిపంజరాలు) వెలికితీయడం సంచలనం రేపింది.
Priyanka Chopra: మూతపడనున్న ప్రియాంక చోప్రా ‘సోనా’ రెస్టారెంట్.. ఎందుకో తెలుసా?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
స్టాప్ డ్యామ్ నీటి మట్టం తగ్గిన తర్వాత, ఒక గ్రామంలోని నివాసితులు అస్థిపంజరాలుగా మారిన వారి మృతదేహాలను కలిగి ఉన్న కారును చూశారు. సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు మిథిలేష్ జాదవ్ (30), ఆమె బావ నీరజ్ సఖ్వార్ (34)గా గుర్తించారు. మిథిలేష్ మరియు నీరజ్ ఒకరికి ఒకరు ప్రేమించుకుంటున్నారని, ఫిబ్రవరిలో వారి ఇంటి నుంచి పారిపోయారని చెబుతున్నారు. గోపి గ్రామంలోని క్వారీ నదిపై నిర్మించిన స్టాప్ డ్యామ్లో లభించిన కారులో ఇద్దరి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు సిహోనియా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర గౌర్ తెలిపారు. వాస్తవానికి, ప్రతి సంవత్సరం స్టాప్ డ్యామ్ నుంచి నీటిని శుభ్రం చేయడానికి నీటిని విడుదల చేస్తారు. నీటిమట్టం తగ్గడంతో మంగళవారం మధ్యాహ్నం స్టాప్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయగా.. మధ్యలో ఓ కారు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని స్టాప్ డ్యామ్ మధ్యలో కారును చూసింది. బాగా కుళ్లిపోయిన మృతదేహాలు స్త్రీ, పురుషుడివని గుర్తించారు.
మృతుడు నీరజ్ సఖ్వార్కు మిథ్లేష్ మరదలు అని తేలింది. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, ఫిబ్రవరి 6న ఇంటి నుంచి పారిపోయారని వారి కుటుంబ సభ్యుల విచారణలో తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిథిలేష్ భర్త ముఖేష్ సఖ్వార్ తన భార్య మార్కెట్కు వెళ్లిందని, ఆపై ఆమె బంధువు నీరజ్తో కలిసి అక్కడి నుంచి పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. వారు తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నందున ఫిబ్రవరి 14న రిపోర్ట్ చేశారు. ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, కారు స్టాప్ డ్యామ్లో ఎప్పుడు, ఎలా పడిపోయింది అనే సహా అన్ని కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తారని తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!