Lok Sabha Polls: శుక్రవారమే తొలి దిశ పోలింగ్.. ఏఏ రాష్ట్రాల్లో అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే ఫస్ట్ ఫేజ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కేంద్ర బలగాలు మోహరించాయి.
ఇది కూడా చదవండి: Sukumar: డైరెక్టర్గా సుకుమార్ కొత్త శిష్యుడు.. హిట్టు హీరోనే పట్టాడుగా!
Also Read
తొలిదశలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అసోంల్లో పోలింగ్ జరగనుంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ల్లో సైతం ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. ఇక తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉంటే.. వాటిలో 8 స్థానాలు.. షహరాన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజనూర్, నగినా, మొరాదాబాద్, రామ్పూర్, పిల్బిత్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: UK couple: కోర్టు షాకింగ్ తీర్పు.. చిన్న తప్పిదంతో ఓ జంటకు ఏం జరిగిందంటే..!
అలాగే పశ్చిమబెంగాల్లో మొత్తం 42 స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి దశలో.. కుచ్ బిహార్, జల్పాయిగురి, అలీపుర్దౌర్స్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాల్లోని 5 స్థానాలు.. రామ్టెక్, నాగ్పూర్, బందారా గోండియా, గడ్చిరౌలి, చిముర్, చంద్రాపూర్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ప్రదేశ్లో 2, మణిపూర్లో 2, మేఘాలయాలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్లో 1, సిక్కిం, త్రిపురలలో ఒక్కో లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్లో కూడా 5 లోక్సభ స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్గఢ్, జమ్ము, కశ్మీర్లో ఒక్కో లోక్సభ స్థానానికి ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19 తేదీతో మొదలై.. ఏడో దశ పోలింగ్ జూన్ 1వ తేదీతో ముగియనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ ముగియనుంది.
తాజావార్తలు
-
Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
-
AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
-
China: “మనం శత్రువులం కాము”.. భారత్కు చైనా సందేశం..
-
INDIA Bloc: 2 ఏళ్ల తర్వాత విపక్ష కూటమి భేటీ.. ఏం చర్చించారంటే..!
-
SlumDog Movie Teaser: ‘మా బతుకులతో ఆడుకుంటే వదలం’.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ ‘స్లమ్డాగ్’ టీజర్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!