Lok Sabha Polls: శుక్రవారమే తొలి దిశ పోలింగ్.. ఏఏ రాష్ట్రాల్లో అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే ఫస్ట్ ఫేజ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కేంద్ర బలగాలు మోహరించాయి.
ఇది కూడా చదవండి: Sukumar: డైరెక్టర్గా సుకుమార్ కొత్త శిష్యుడు.. హిట్టు హీరోనే పట్టాడుగా!
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
తొలిదశలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అసోంల్లో పోలింగ్ జరగనుంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ల్లో సైతం ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. ఇక తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉంటే.. వాటిలో 8 స్థానాలు.. షహరాన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజనూర్, నగినా, మొరాదాబాద్, రామ్పూర్, పిల్బిత్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: UK couple: కోర్టు షాకింగ్ తీర్పు.. చిన్న తప్పిదంతో ఓ జంటకు ఏం జరిగిందంటే..!
అలాగే పశ్చిమబెంగాల్లో మొత్తం 42 స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి దశలో.. కుచ్ బిహార్, జల్పాయిగురి, అలీపుర్దౌర్స్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాల్లోని 5 స్థానాలు.. రామ్టెక్, నాగ్పూర్, బందారా గోండియా, గడ్చిరౌలి, చిముర్, చంద్రాపూర్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ప్రదేశ్లో 2, మణిపూర్లో 2, మేఘాలయాలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్లో 1, సిక్కిం, త్రిపురలలో ఒక్కో లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్లో కూడా 5 లోక్సభ స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్గఢ్, జమ్ము, కశ్మీర్లో ఒక్కో లోక్సభ స్థానానికి ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19 తేదీతో మొదలై.. ఏడో దశ పోలింగ్ జూన్ 1వ తేదీతో ముగియనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ ముగియనుంది.
తాజావార్తలు
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!