Congress: ఈసీకి కాంగ్రెస్ లేఖ.. 2 రాష్ట్రాల్లో పోలింగ్ తేదీ మార్చాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్, ముస్లిం సంఘాలు కోరాయి. ఈ మేరకు సీఈసీకి కాంగ్రెస్ లేఖ రాసింది. ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమవుతోంది. అయితే రెండో విడత ఏప్రిల్ 26న జరగనుంది. అయితే ఏప్రిల్ 26 శుక్రవారం వచ్చింది. ఇది ముస్లింలకు ప్రత్యేక మైన రోజు. ఆ రోజున ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారు. ఈ కారణంగా తేదీలను మార్చాలని ఈసీని కేరళ కాంగ్రెస్ కోరింది.
ఏప్రిల్ 26 ముస్లింలకు ప్రత్యేక మైన రోజు అని.. ఓటు వేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల తేదీని మార్చాలని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ MM హసన్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత VD సతీశన్.. ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే కేరళతో పాటు తమిళనాడులో కూడా పోలింగ్ తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కోరింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఏప్రిల్ 26న శుక్రవారం కావడంతో ముస్లిం ఓటర్లు ఇబ్బంది పడొచ్చని.. అలాగే ముస్లిం అధికారులు కూడా డ్యూటీలో పాల్గొనేందుకు ఇబ్బంది పడతారని ముస్లిం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కేరళ నేతలు, ముస్లిం నేతలు మెయిల్స్ పంపించారు. ఏప్రిల్ 26 తేదీని మార్చాలని కోరారు.
త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేఫన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే రెండో విడత మాత్రం శుక్రవారం రావడంతో ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరో తేదీకి మార్చాలని కోరుతున్నాయి. మరీ కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!