Congress: కాంగ్రెస్కు మరో షాక్.. బీజేపీలో చేరిన గౌరవ్ వల్లభ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలంతా హస్తం పార్టీని వీడుతున్నారు. బుధవారం బాక్సర్ విజేందర్ సింగ్ కూడా కాంగ్రెస్కు రాజీనామా చేసి పువ్వు పార్టీలో చేరారు. తాజాగా గురువారం కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కూడా పార్టీకి రాజీనామా చేసి కాషాయ గూటికి చేరారు. ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే.. వల్లభ్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: Mudragada Padmanabham: జనసేనాని పవన్ కల్యాణ్పై ముద్రగడ ఫైర్
Also Read
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
కాంగ్రెస్కు రాజీనామా చేసిన కొద్ది సేపట్లోనే బీహార్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అనిల్ శర్మతో కలిసి వల్లభ్ బీజేపీలో చేరారు. రెండు పేజీల రాజీనామా లేఖను రాస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. కాంగ్రెస్లోని పదవులకు.. ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇక లేఖలో కాంగ్రెస్ తీరును తూర్పారాబట్టారు. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం లేదని విమర్శించారు. ఈ విధంగా పార్టీ ముందుకు సాగడం తనకు ఇబ్బందికరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CM YS Jagan: డ్రైవర్కు టికెట్ ఇస్తే తప్పేంటి?.. లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి
2023లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ నియోజకవర్గం నుంచి వల్లభ్ పోటీ చేసి విఫలమయ్యారు. దాదాపు 32,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2019లో జార్ఖండ్లోని జంషెడ్పూర్ తూర్పు నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆ విధంగా వల్లభ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరి ఏ మాత్రం సరిగ్గా లేదని వల్లభ్ ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Mrunal Thakur: రోజూ ఏడ్చేదాన్ని.. తెలుగు సినిమాల్లో నటించొద్దనుకున్నా: మృణాల్ ఠాకూర్
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. అటు తర్వాత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.
कांग्रेस पार्टी आज जिस प्रकार से दिशाहीन होकर आगे बढ़ रही है,उसमें मैं ख़ुद को सहज महसूस नहीं कर पा रहा.मैं ना तो सनातन विरोधी नारे लगा सकता हूं और ना ही सुबह-शाम देश के वेल्थ क्रिएटर्स को गाली दे सकता.इसलिए मैं कांग्रेस पार्टी के सभी पदों व प्राथमिक सदस्यता से इस्तीफ़ा दे रहाहूं pic.twitter.com/Xp9nFO80I6
— Prof. Gourav Vallabh (@GouravVallabh) April 4, 2024
తాజావార్తలు
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!