Lok sabha election: నెమ్మదిగా సాగుతున్న ఓటింగ్.. ఒంటి గంట వరకు ఎంతంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 88 స్థానాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. సెకండ్ విడతలో 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా.. మధ్యప్రదేశ్లోని బేతుల్లో మాయవతి పార్టీకి చెందిన బీఎస్పీ అభ్యర్థి మృతిచెందడంతో పోలింగ్ షెడ్యూల్ను మార్చారు. దీంతో శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 88 స్థానాల్లో ఓటింగ్ నడుస్తోంది. బెతుల్లో మే 7న పోలింగ్ జరగనుంది. రాజస్థాన్, కేరళలో అన్ని స్థానాలకు ఓటింగ్ నడుస్తోంది. అయితే పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 ఒంటి గంట వరకు 39 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. సాయంత్రానికి పుంజుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎండలు కారణంగా బీహార్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Uniform Civil Code: భారతదేశం అంతటా ఒకే సివిల్ కోడ్.. ఇది మోడీ హామీ..
Also Read
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎనిమిది, మధ్యప్రదేశ్లో 7, అస్సాం, బీహార్లో ఐదు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లో మూడింటికి రెండో దశ పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్, మణిపూర్, త్రిపురలో ఒక్కొక్కటి చొప్పున పోలింగ్ జరుగుతోంది. రెండో దశ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్, శశిథరూర్, హేమ మాలిని, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పోటీలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Balmoori Venkat: హరీష్ రావు రాజీనామా లేఖ వృధా కానివ్వం..!
తదుపరి ఎన్నికల పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13న తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఇక తెలంగాణలో అయితే పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. అనంతరం మే 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Minister Komati Reddy: నువ్వు బీఆర్ఎస్లో ఉద్యోగి మాత్రమే.. హరీష్ రావుకు కోమటిరెడ్డి కౌంటర్
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?