Group-1 Mains : గ్రూప్-1 మెయిన్ అభ్యర్థులకు షాక్.. పరీక్షలకు లైన్ క్లియర్..!
- గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్
- సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్ట్ డివిజన్ బెంచ్
- రిట్ అప్పీల్స్ను కొట్టివేసిన హైకోర్ట్ డివిజన్ బెంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, డివిజన్ బెంచ్ ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు, కోర్టు అభ్యర్థులకు షాక్ ఇచ్చింది, ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరగబోయే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అంతేకాక, కోర్టు చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేయడం సాధ్యం కాదని, 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల్లో పడడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు రద్దు కావడంతో, నిరుద్యోగులు ఈ పరీక్షలకు ఎంతో ఎదురుచూస్తున్నారని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ గ్రూప్-1 పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠిన బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని కూడా సమాచారం అందించారు.
Benjamin Netanyahu: “ఆడు మగాడ్రా బుజ్జి”.. హమాస్, హిజ్బుల్లాకు చుక్కలు చూపిస్తున్న నెతన్యాహూ..
Also Read
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
హైదరాబాద్లో 8, ఆర్ఆర్లో 11, మల్కాజిగిరిలో 27 కేంద్రాలు
హైదరాబాద్లో ఎనిమిది, రంగారెడ్డిలో 11, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 27 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా పరీక్ష నిర్వహణను పర్యవేక్షిస్తారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు వేసేందుకు అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అభ్యర్థులను మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఇప్పటి వరకు 85 శాతం మంది అభ్యర్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ప్రత్యేక ఛాలెంజ్ ఉన్న వ్యక్తులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. లేఖరుల సహాయంతో పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 46 కేంద్రాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. TGSPDCL నుండి ముగ్గురు చీఫ్ ఇంజనీర్లు పరీక్షా కేంద్రాలకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తారు , RTC పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. సమావేశంలో టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
AP Crime: కోడలిపై మామ అత్యాచారయత్నం.. తిరస్కరించడంతో బండరాయితో..
తాజావార్తలు
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!