Group-1 Mains : గ్రూప్-1 మెయిన్ అభ్యర్థులకు షాక్.. పరీక్షలకు లైన్ క్లియర్..!
- గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్
- సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్ట్ డివిజన్ బెంచ్
- రిట్ అప్పీల్స్ను కొట్టివేసిన హైకోర్ట్ డివిజన్ బెంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, డివిజన్ బెంచ్ ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు, కోర్టు అభ్యర్థులకు షాక్ ఇచ్చింది, ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరగబోయే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అంతేకాక, కోర్టు చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేయడం సాధ్యం కాదని, 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల్లో పడడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు రద్దు కావడంతో, నిరుద్యోగులు ఈ పరీక్షలకు ఎంతో ఎదురుచూస్తున్నారని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ గ్రూప్-1 పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠిన బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని కూడా సమాచారం అందించారు.
Benjamin Netanyahu: “ఆడు మగాడ్రా బుజ్జి”.. హమాస్, హిజ్బుల్లాకు చుక్కలు చూపిస్తున్న నెతన్యాహూ..
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
హైదరాబాద్లో 8, ఆర్ఆర్లో 11, మల్కాజిగిరిలో 27 కేంద్రాలు
హైదరాబాద్లో ఎనిమిది, రంగారెడ్డిలో 11, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 27 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా పరీక్ష నిర్వహణను పర్యవేక్షిస్తారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు వేసేందుకు అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అభ్యర్థులను మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఇప్పటి వరకు 85 శాతం మంది అభ్యర్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ప్రత్యేక ఛాలెంజ్ ఉన్న వ్యక్తులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. లేఖరుల సహాయంతో పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 46 కేంద్రాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. TGSPDCL నుండి ముగ్గురు చీఫ్ ఇంజనీర్లు పరీక్షా కేంద్రాలకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తారు , RTC పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. సమావేశంలో టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
AP Crime: కోడలిపై మామ అత్యాచారయత్నం.. తిరస్కరించడంతో బండరాయితో..
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!