Group-1 Mains : గ్రూప్-1 మెయిన్ అభ్యర్థులకు షాక్.. పరీక్షలకు లైన్ క్లియర్..!
- గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్
- సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్ట్ డివిజన్ బెంచ్
- రిట్ అప్పీల్స్ను కొట్టివేసిన హైకోర్ట్ డివిజన్ బెంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, డివిజన్ బెంచ్ ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు, కోర్టు అభ్యర్థులకు షాక్ ఇచ్చింది, ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరగబోయే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అంతేకాక, కోర్టు చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేయడం సాధ్యం కాదని, 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల్లో పడడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు రద్దు కావడంతో, నిరుద్యోగులు ఈ పరీక్షలకు ఎంతో ఎదురుచూస్తున్నారని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ గ్రూప్-1 పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠిన బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని కూడా సమాచారం అందించారు.
Benjamin Netanyahu: “ఆడు మగాడ్రా బుజ్జి”.. హమాస్, హిజ్బుల్లాకు చుక్కలు చూపిస్తున్న నెతన్యాహూ..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
హైదరాబాద్లో 8, ఆర్ఆర్లో 11, మల్కాజిగిరిలో 27 కేంద్రాలు
హైదరాబాద్లో ఎనిమిది, రంగారెడ్డిలో 11, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 27 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా పరీక్ష నిర్వహణను పర్యవేక్షిస్తారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు వేసేందుకు అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అభ్యర్థులను మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఇప్పటి వరకు 85 శాతం మంది అభ్యర్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ప్రత్యేక ఛాలెంజ్ ఉన్న వ్యక్తులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. లేఖరుల సహాయంతో పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 46 కేంద్రాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. TGSPDCL నుండి ముగ్గురు చీఫ్ ఇంజనీర్లు పరీక్షా కేంద్రాలకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తారు , RTC పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. సమావేశంలో టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
AP Crime: కోడలిపై మామ అత్యాచారయత్నం.. తిరస్కరించడంతో బండరాయితో..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!