Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Let Us Join Together To Make India A Developed Nation By 2047 Kiren Rijiju To All Parties

Kiren Rijiju: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు

Published Date :August 8, 2023 , 5:33 pm
By Mahesh Jakki
Kiren Rijiju: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kiren Rijiju: కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఇందులో భాగంగానే ఎంపీలు అందరూ ఈనెల 11 వరకు సభ్యులు సభలకు తప్పనిసరిగా రావాలని విప్‌లు జారీ చేశాయి.మరోవైపు 10వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు.

Also Read: I-T Returns Filed: పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు

Also Read

  • Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
  • Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
  • Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..

విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో కేంద్రం తరఫున కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. దేశంలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. 2014కి ముందు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జాతి వివక్ష, దౌర్జన్యాలను ఎదుర్కొన్నారని, 2014 తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి గౌహతిలో డీజీపీ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతను పోలీసులు తప్పనిసరిగా చూసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన వాదనలు వినిపిస్తూ.. ప్రమాదాలు దురదృష్టకరం, బాధాకరమని, ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఒక్క ప్రాణం పోవడం కూడా తీరని విషాదమన్నారు. పోయింది. అయితే సంఖ్యలు తగ్గాయన్నారు. 2004 నుంచి 2014 వరకు సంవత్సరానికి 171 రైలు ప్రమాదాలు జరిగితే.. అదే 2014 నుంచి 2023 వరకు 71కి తగ్గించబడ్డాయన్నారు. రైలు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయన్నారు. ఒలింపిక్‌ క్రీడలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో భారత్ ఎలాంటి పతకాలు సాధించలేకపోయిందని.. 2020లో మాత్రమే దేశం మొదటిసారి ఏడు పతకాలు సాధించిందని అన్నారు. ఆటగాళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారని కేంద్ర మంత్రి చెప్పారు.

Also Read: Rajya Sabha: డెరెక్‌ ఓబ్రెయిన్ సస్పెన్షన్‌పై రాజ్యసభలో హైడ్రామా.. చివరకు..

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ గురించి కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రస్తావించారు. “అమెరికా వంటి దేశాలు కూడా అంతరిక్ష ప్రాజెక్టులలో భారతదేశంతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాయి” అని ఆయన చెప్పారు. 2047 నాటికి అన్ని పార్టీలు కలిసి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పిలుపునిచ్చారు. “మేము 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నాము, కాబట్టి అమృత్‌కాల్ జరుపుకుంటున్నప్పుడు మాతో చేరండి. ఇది బీజేపీ లేదా ఎన్‌డీఏ కార్యక్రమం కాదు. ఇది దేశం కోసం ఉద్దేశించబడింది. 2047 నాటికి భారతదేశాన్ని సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చే గొప్ప ప్రయాణంలో మనం కలిసి వెళ్దాం అని పార్టీ, ప్రభుత్వం నుండి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను” అని కిరణ్‌ రిజిజు అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Kiren Rijiju
  • Lok Sabha
  • no-confidence motion

తాజావార్తలు

  • Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..

  • Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?

  • Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..

  • Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..

  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions