Pulses And Oilseed Prices: సామాన్యులకు షాక్.. వర్షాలు తగ్గడంతో పెరగనున్న పప్పులు, నూనె గింజల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulses And Oilseed Prices: ఆగస్టులో రుతుపవనాలు బలహీన పడ్డాయి. దీంతో రాబోయే కాలంలో కొన్ని ఇబ్బందులకు ఇది దారి తీయవచ్చు. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం గత 8 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది. బలహీన రుతుపవనాల ట్రెండ్ సెప్టెంబర్లో కూడా కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీని వెనుక ఎల్నినో కారణం అని చెబుతున్నారు. తక్కువ వర్షం కారణంగా పప్పులు, నూనె గింజల ధరలు పెరగవచ్చు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ పంటల నాట్లు దాదాపు పూర్తయినప్పటికీ, రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల పంట దిగుబడి దెబ్బతినే అవకాశం ఉంది.
Read Also:Weather Update: మళ్లీ వర్షాలు.. ఆ రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
చాలా ప్రాంతాల్లో తగ్గిన వర్షపాతం
పప్పుధాన్యాలు, నూనె గింజలు విత్తిన తరువాత ఇప్పుడు ఈ పంట పుష్పించే దశలో ఉంది. వాటికి ఎక్కువ నీరు అవసరం. బలహీనమైన రుతుపవనాలు ఈ పంటల దిగుబడిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. వాతావరణ శాఖ ప్రకారం సోమవారం వరకు భారతదేశంలో రుతుపవనాల లాగ్ పీరియడ్ సగటు 92 శాతం ఉంది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో మాత్రమే గతేడాది కంటే 6 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు మధ్య భాగంలో 7 శాతం, తూర్పు ఉత్తర భారతదేశంలో 15 శాతం, దక్షిణ ప్రాంతంలో 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత సంవత్సరాలతో పోల్చితే ఆగస్టు నెలలో దేశం మొత్తం 35 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ సీనియర్ అధికారి ఫైనాన్షియల్ టైమ్స్తో చెప్పారు. సెప్టెంబరులో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసినా ఇంత భారీ లోటును తీర్చడం కష్టమే.
Read Also:Worm in Brain: షాకింగ్ న్యూస్.. మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు! కొండచిలువలో ఉండే
ఖరీఫ్ సీజన్లో ఆగస్టు, సెప్టెంబరులో కురిసే వర్షాలపైనే పంటల దిగుబడి ఆధారపడి ఉండడం గమనార్హం. ఈ రెండు నెలల్లో తక్కువ వర్షపాతం కారణంగా దేశంలో వరి, చెరకు, పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి దెబ్బతింటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరుగుదల నమోదైంది. అది 330.5 మిలియన్ టన్నులకు (MT) పెరిగింది. ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 332 మిలియన్ టన్నులుగా నిర్ణయించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యానికి పెద్ద దెబ్బే. దాని ప్రభావం పప్పులు, నూనె గింజల ధరలపై కూడా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!