Pulses And Oilseed Prices: సామాన్యులకు షాక్.. వర్షాలు తగ్గడంతో పెరగనున్న పప్పులు, నూనె గింజల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulses And Oilseed Prices: ఆగస్టులో రుతుపవనాలు బలహీన పడ్డాయి. దీంతో రాబోయే కాలంలో కొన్ని ఇబ్బందులకు ఇది దారి తీయవచ్చు. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం గత 8 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది. బలహీన రుతుపవనాల ట్రెండ్ సెప్టెంబర్లో కూడా కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీని వెనుక ఎల్నినో కారణం అని చెబుతున్నారు. తక్కువ వర్షం కారణంగా పప్పులు, నూనె గింజల ధరలు పెరగవచ్చు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ పంటల నాట్లు దాదాపు పూర్తయినప్పటికీ, రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల పంట దిగుబడి దెబ్బతినే అవకాశం ఉంది.
Read Also:Weather Update: మళ్లీ వర్షాలు.. ఆ రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..
Also Read
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
చాలా ప్రాంతాల్లో తగ్గిన వర్షపాతం
పప్పుధాన్యాలు, నూనె గింజలు విత్తిన తరువాత ఇప్పుడు ఈ పంట పుష్పించే దశలో ఉంది. వాటికి ఎక్కువ నీరు అవసరం. బలహీనమైన రుతుపవనాలు ఈ పంటల దిగుబడిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. వాతావరణ శాఖ ప్రకారం సోమవారం వరకు భారతదేశంలో రుతుపవనాల లాగ్ పీరియడ్ సగటు 92 శాతం ఉంది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో మాత్రమే గతేడాది కంటే 6 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు మధ్య భాగంలో 7 శాతం, తూర్పు ఉత్తర భారతదేశంలో 15 శాతం, దక్షిణ ప్రాంతంలో 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత సంవత్సరాలతో పోల్చితే ఆగస్టు నెలలో దేశం మొత్తం 35 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ సీనియర్ అధికారి ఫైనాన్షియల్ టైమ్స్తో చెప్పారు. సెప్టెంబరులో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసినా ఇంత భారీ లోటును తీర్చడం కష్టమే.
Read Also:Worm in Brain: షాకింగ్ న్యూస్.. మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు! కొండచిలువలో ఉండే
ఖరీఫ్ సీజన్లో ఆగస్టు, సెప్టెంబరులో కురిసే వర్షాలపైనే పంటల దిగుబడి ఆధారపడి ఉండడం గమనార్హం. ఈ రెండు నెలల్లో తక్కువ వర్షపాతం కారణంగా దేశంలో వరి, చెరకు, పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి దెబ్బతింటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరుగుదల నమోదైంది. అది 330.5 మిలియన్ టన్నులకు (MT) పెరిగింది. ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 332 మిలియన్ టన్నులుగా నిర్ణయించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యానికి పెద్ద దెబ్బే. దాని ప్రభావం పప్పులు, నూనె గింజల ధరలపై కూడా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!