Worm in Brain: షాకింగ్ న్యూస్.. మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు! కొండచిలువలో ఉండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pythons Worm found in Australian Woman’s Brain: షాకింగ్ న్యూస్.. ఓ మహిళ మెదడులో ఏకంగా 8 సెంటీమీటర్ల పురుగు ఉంది. సజీవంగా మరియు మెలికలు తిరుగుతున్న ఆ పరాన్నజీవిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళకు శస్త్ర చికిత్స చేసి.. ఆ పరాన్నజీవిని బయటికి తీశారు. ప్రస్తుతం సదరు మహిళ కోలుకుంటోంది. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటుచేసుకుంది. 8 సెంటీమీటర్ల పురుగుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే…
న్యూ సౌత్ వేల్స్కు చెందిన 64 ఏళ్ల మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో సహా ఇతర సమస్యలతో బాధపడుతోంది. 2021లో ఆమె స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఎలాంటి మెరుగైన ఫలితం లేకపోయింది. 2022 నాటికి ఆమె మతిమరుపుతో సహా జ్వరం వంటి సమస్యలు అధికం అయ్యాయి. దీంతో కాన్బెర్రా ఆసుపత్రి వైద్యులు అన్ని పరీక్షలు చేసినా.. రిజల్ట్స్ మాత్రం నార్మల్గానే వచ్చాయి. చివరిగా ఎంఆర్ఐ స్కాన్ చేయగా.. ఆ మహిళ మెదడులో ఉన్న పురుగు చూసి వైద్యులు కంగుతిన్నారు. ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ పురుగుని తీసేశారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అనే పరాన్నజీవి మహిళ మెదడులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది సాధారణంగా కొండచిలువ (పైథాన్) శరీరంలో ఉండే ఒక రకమైన పురుగని పరిశోధకులు అంటున్నారు. కొండచిలువలు నివశించే సరస్సు సమీపంలో ఆ మహిళ నివసిస్తున్నందున ఈ పురుగు ఆమె మెదడులో వచ్చిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆ మహిళ వంట చేయడం కోసం కట్టెలు, ఆకుకూరలు వంటి వాటిని ఇంటికి తీసుకొచ్చేది. వాటిపై కొండచిలువ పాకడం లేదా మలం ద్వారా ఈ పురుగు ఉండే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
Also Read: RCB Jersey: కోర్టు మెట్లెక్కిన ఆర్సీబీ.. ఆ సీన్ను మార్చేందుకు ఒప్పుకున్న ‘జైలర్’ టీమ్!
ఆకుకూరలు తిన్నప్పుడు లేదా మరో విధంగానో ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అనే పరాన్నజీవి మహిళ శరీరంలోకి వెళ్లి.. మెదడులో తిష్ట వేసింది. అది ఏకంగా 8 సెంటీమీటర్ల పొడవుతో మెలికలు తిరిగింది. దీని కారణంగా మహిళ విపరీతమైన వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యల బారిన పడింది. చివరకు పురుగును గుర్తించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి దానిని తీసేశారు. ఈ కేసు ప్రపంచంలోనే మొదటి సంక్రమణగా గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జూనోటిక్ (జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు) వ్యాధులేనని వైద్యులు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ఇతర కేసులు గుర్తించబడే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!