Worm in Brain: షాకింగ్ న్యూస్.. మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు! కొండచిలువలో ఉండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pythons Worm found in Australian Woman’s Brain: షాకింగ్ న్యూస్.. ఓ మహిళ మెదడులో ఏకంగా 8 సెంటీమీటర్ల పురుగు ఉంది. సజీవంగా మరియు మెలికలు తిరుగుతున్న ఆ పరాన్నజీవిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళకు శస్త్ర చికిత్స చేసి.. ఆ పరాన్నజీవిని బయటికి తీశారు. ప్రస్తుతం సదరు మహిళ కోలుకుంటోంది. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటుచేసుకుంది. 8 సెంటీమీటర్ల పురుగుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే…
న్యూ సౌత్ వేల్స్కు చెందిన 64 ఏళ్ల మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో సహా ఇతర సమస్యలతో బాధపడుతోంది. 2021లో ఆమె స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఎలాంటి మెరుగైన ఫలితం లేకపోయింది. 2022 నాటికి ఆమె మతిమరుపుతో సహా జ్వరం వంటి సమస్యలు అధికం అయ్యాయి. దీంతో కాన్బెర్రా ఆసుపత్రి వైద్యులు అన్ని పరీక్షలు చేసినా.. రిజల్ట్స్ మాత్రం నార్మల్గానే వచ్చాయి. చివరిగా ఎంఆర్ఐ స్కాన్ చేయగా.. ఆ మహిళ మెదడులో ఉన్న పురుగు చూసి వైద్యులు కంగుతిన్నారు. ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ పురుగుని తీసేశారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అనే పరాన్నజీవి మహిళ మెదడులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది సాధారణంగా కొండచిలువ (పైథాన్) శరీరంలో ఉండే ఒక రకమైన పురుగని పరిశోధకులు అంటున్నారు. కొండచిలువలు నివశించే సరస్సు సమీపంలో ఆ మహిళ నివసిస్తున్నందున ఈ పురుగు ఆమె మెదడులో వచ్చిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆ మహిళ వంట చేయడం కోసం కట్టెలు, ఆకుకూరలు వంటి వాటిని ఇంటికి తీసుకొచ్చేది. వాటిపై కొండచిలువ పాకడం లేదా మలం ద్వారా ఈ పురుగు ఉండే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
Also Read: RCB Jersey: కోర్టు మెట్లెక్కిన ఆర్సీబీ.. ఆ సీన్ను మార్చేందుకు ఒప్పుకున్న ‘జైలర్’ టీమ్!
ఆకుకూరలు తిన్నప్పుడు లేదా మరో విధంగానో ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అనే పరాన్నజీవి మహిళ శరీరంలోకి వెళ్లి.. మెదడులో తిష్ట వేసింది. అది ఏకంగా 8 సెంటీమీటర్ల పొడవుతో మెలికలు తిరిగింది. దీని కారణంగా మహిళ విపరీతమైన వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యల బారిన పడింది. చివరకు పురుగును గుర్తించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి దానిని తీసేశారు. ఈ కేసు ప్రపంచంలోనే మొదటి సంక్రమణగా గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జూనోటిక్ (జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు) వ్యాధులేనని వైద్యులు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ఇతర కేసులు గుర్తించబడే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!