Worm in Brain: షాకింగ్ న్యూస్.. మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు! కొండచిలువలో ఉండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pythons Worm found in Australian Woman’s Brain: షాకింగ్ న్యూస్.. ఓ మహిళ మెదడులో ఏకంగా 8 సెంటీమీటర్ల పురుగు ఉంది. సజీవంగా మరియు మెలికలు తిరుగుతున్న ఆ పరాన్నజీవిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళకు శస్త్ర చికిత్స చేసి.. ఆ పరాన్నజీవిని బయటికి తీశారు. ప్రస్తుతం సదరు మహిళ కోలుకుంటోంది. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటుచేసుకుంది. 8 సెంటీమీటర్ల పురుగుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే…
న్యూ సౌత్ వేల్స్కు చెందిన 64 ఏళ్ల మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో సహా ఇతర సమస్యలతో బాధపడుతోంది. 2021లో ఆమె స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఎలాంటి మెరుగైన ఫలితం లేకపోయింది. 2022 నాటికి ఆమె మతిమరుపుతో సహా జ్వరం వంటి సమస్యలు అధికం అయ్యాయి. దీంతో కాన్బెర్రా ఆసుపత్రి వైద్యులు అన్ని పరీక్షలు చేసినా.. రిజల్ట్స్ మాత్రం నార్మల్గానే వచ్చాయి. చివరిగా ఎంఆర్ఐ స్కాన్ చేయగా.. ఆ మహిళ మెదడులో ఉన్న పురుగు చూసి వైద్యులు కంగుతిన్నారు. ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ పురుగుని తీసేశారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అనే పరాన్నజీవి మహిళ మెదడులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది సాధారణంగా కొండచిలువ (పైథాన్) శరీరంలో ఉండే ఒక రకమైన పురుగని పరిశోధకులు అంటున్నారు. కొండచిలువలు నివశించే సరస్సు సమీపంలో ఆ మహిళ నివసిస్తున్నందున ఈ పురుగు ఆమె మెదడులో వచ్చిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆ మహిళ వంట చేయడం కోసం కట్టెలు, ఆకుకూరలు వంటి వాటిని ఇంటికి తీసుకొచ్చేది. వాటిపై కొండచిలువ పాకడం లేదా మలం ద్వారా ఈ పురుగు ఉండే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
Also Read: RCB Jersey: కోర్టు మెట్లెక్కిన ఆర్సీబీ.. ఆ సీన్ను మార్చేందుకు ఒప్పుకున్న ‘జైలర్’ టీమ్!
ఆకుకూరలు తిన్నప్పుడు లేదా మరో విధంగానో ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ అనే పరాన్నజీవి మహిళ శరీరంలోకి వెళ్లి.. మెదడులో తిష్ట వేసింది. అది ఏకంగా 8 సెంటీమీటర్ల పొడవుతో మెలికలు తిరిగింది. దీని కారణంగా మహిళ విపరీతమైన వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యల బారిన పడింది. చివరకు పురుగును గుర్తించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి దానిని తీసేశారు. ఈ కేసు ప్రపంచంలోనే మొదటి సంక్రమణగా గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జూనోటిక్ (జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు) వ్యాధులేనని వైద్యులు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ఇతర కేసులు గుర్తించబడే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!