Lalu Yadav: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు బాధ్యులెవరు..?
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాద ఘటన
- ప్రమాదంపై ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ప్రశ్నలు
- దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు బాధ్యులెవరు..?- లాలూ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 8 మంది మరణించారు. అంతేకాకుండా.. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కాగా.. ఈ రైలు ప్రమాద ఘటనపై ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ యాదవ్ ప్రశ్నలు సంధించారు. దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. గత ఏడాది కాలంలో 7 పెద్ద రైల్వే ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ ‘X’ లో పోస్ట్ చేశారు. దేశంలో తరచుగా జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు బాధ్యులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు.
देश में लगातार हो रहे रेल हादसों का जिम्मेवार कौन है?
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
— Lalu Prasad Yadav (@laluprasadrjd) June 17, 2024
Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. మృతి చెందిన వారిలో లోకో పైలట్, సహాయకుడు
ఈరోజు కతిహార్ డివిజన్లోని రంగపాణి-నిజబరీ స్టేషన్ల మధ్య స్టేషన్లో నిలిచి ఉన్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ను వెనుక నుండి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ క్రమంలో.. కాంచన్జంగా ఎక్స్ప్రెస్కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. గట్టిగా ఢీకొట్టడంతో ఒక బోగీ మరో బోగీపైకి ఎక్కింది. ఇందులో 8 మందికి పైగా మృతి చెందినట్లు నిర్ధారించారు. 50 మందికి పైగా గాయపడ్డారని.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి ఒక్కొక్కరికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు.
Bengal rail accident: మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా..
కాగా.. గత ఏడాది కాలంలో దేశంలో 7కు పైగా పెద్ద రైల్వే ప్రమాదాలు జరిగాయి. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 296 మంది చనిపోయారు. 2023 అక్టోబర్ 29న ఆంధ్రాలోని విజయనగరం కంటపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్తారాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. గత ఏడాది అక్టోబర్లో బక్సర్లోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదానికి గురైంది. రైలులోని 24 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడినట్లు నిర్ధారించారు. నలుగురు మరణించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..