Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. మృతి చెందిన వారిలో లోకో పైలట్, సహాయకుడు
- కాంచనజంగా ఎక్స్ప్రెస్-గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో ఇప్పటివరకు 8 మృతి
- ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని తెలిపిన రైల్వే అధికారులు
- ముగిసిన సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకు 8 మృతి చెందారు. అందులో ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు ప్రయాణికులు, ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారు. గూడ్స్ రేక్లోని లోకోమోటివ్ పైలట్, అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్, ఎక్స్ప్రెస్ రైలులోని గార్డు మరణించారు. దాదాపు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఎక్స్ప్రెస్ రైలులోని చివరి రెండు కోచ్లు గార్డు కోచ్, కార్గో వ్యాన్ అని అధికారులు తెలిపారు. దాదాపు 200 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సీల్దా వైపు వెళుతోంది. అంతలో వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి. ఈ ప్రమాదంతో కనీసం 10 రైళ్లను దారి మళ్లించారు.
Read Also: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్ లో ఉరి వేసుకున్న విద్యార్థిని..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఈ ప్రమాదంపై ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబ్యసాచి డి మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, కొన్ని రైళ్లను దారి మళ్లించినప్పటికీ, అలుబారి-సిలిగురి-న్యూ జల్పైగురి లైన్ ఉన్నందున రాకపోకలకు ఆటంకం ఉండదని చెప్పారు. ఎంఎస్ సిన్హా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ చేపడుతామని.. ఈ రైలు మార్గంలో కవాచ్ యాంటీ-కొలిజన్ సిస్టమ్ను అమలు చేయలేదని అంగీకరించారు. కేవలం ఢిల్లీ-గౌహతి మార్గంలో ప్లాన్ చేసినట్లు ఆమె తెలిపారు. గత ఏడాది జూన్లో ఒడిశాలోని బాలాసోర్లో ట్రిపుల్ రైలు ఢీకొన్న ఘటనలో 293 మంది మృతి చెందగా, 1,200 మందికి పైగా గాయపడిన తర్వాత దేశీయంగా అభివృద్ధి చెందిన కవాచ్ వ్యవస్థ లేకపోవడం గురించి కూడా చర్చ జరిగింది.
Read Also: Minister Satyakumar: రుయా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సత్యకుమార్
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?