Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. మృతి చెందిన వారిలో లోకో పైలట్, సహాయకుడు
- కాంచనజంగా ఎక్స్ప్రెస్-గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో ఇప్పటివరకు 8 మృతి
- ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని తెలిపిన రైల్వే అధికారులు
- ముగిసిన సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకు 8 మృతి చెందారు. అందులో ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు ప్రయాణికులు, ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారు. గూడ్స్ రేక్లోని లోకోమోటివ్ పైలట్, అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్, ఎక్స్ప్రెస్ రైలులోని గార్డు మరణించారు. దాదాపు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఎక్స్ప్రెస్ రైలులోని చివరి రెండు కోచ్లు గార్డు కోచ్, కార్గో వ్యాన్ అని అధికారులు తెలిపారు. దాదాపు 200 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సీల్దా వైపు వెళుతోంది. అంతలో వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి. ఈ ప్రమాదంతో కనీసం 10 రైళ్లను దారి మళ్లించారు.
Read Also: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్ లో ఉరి వేసుకున్న విద్యార్థిని..
Also Read
ఈ ప్రమాదంపై ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబ్యసాచి డి మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, కొన్ని రైళ్లను దారి మళ్లించినప్పటికీ, అలుబారి-సిలిగురి-న్యూ జల్పైగురి లైన్ ఉన్నందున రాకపోకలకు ఆటంకం ఉండదని చెప్పారు. ఎంఎస్ సిన్హా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ చేపడుతామని.. ఈ రైలు మార్గంలో కవాచ్ యాంటీ-కొలిజన్ సిస్టమ్ను అమలు చేయలేదని అంగీకరించారు. కేవలం ఢిల్లీ-గౌహతి మార్గంలో ప్లాన్ చేసినట్లు ఆమె తెలిపారు. గత ఏడాది జూన్లో ఒడిశాలోని బాలాసోర్లో ట్రిపుల్ రైలు ఢీకొన్న ఘటనలో 293 మంది మృతి చెందగా, 1,200 మందికి పైగా గాయపడిన తర్వాత దేశీయంగా అభివృద్ధి చెందిన కవాచ్ వ్యవస్థ లేకపోవడం గురించి కూడా చర్చ జరిగింది.
Read Also: Minister Satyakumar: రుయా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సత్యకుమార్
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!