Russia-Ukraine War: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని కీవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో సోమవారం ఉదయం పలు పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని నెలల విరామం తర్వాత కీవ్లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరగగా.. పొగలు కమ్ముకున్నాయి. ఎల్వివ్, జైటోమిర్, ఖ్మెల్నిట్స్కీ, డ్నిప్రో, టెర్నోపిల్ నగరాల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. దేశంలోని అన్ని నగరాల్లో అనేక పేలుళ్లు నమోదవుతున్నాయి. స్థానిక మీడియా ది కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం, కీవ్లో శక్తివంతమైన పేలుళ్ల కారణంగా విద్యుత్ అంతరాయం జరిగిందని నివేదించింది. షెవ్చెంకో జిల్లాలో కూడా ఈ పేలుళ్లు సంభవించినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో వెల్లడించారు. పేలుళ్ల కారణంగా ప్రాణనష్టం జరిగిందని, అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్ చారిత్రక పాత నగరం కాగా.. అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. బాంబు దాడుల్లో కీవ్లోని పలు ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. క్రిమియా బ్రిడ్జి కూల్చివేతకు ప్రతీకారంగా ఈ భీకర దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయంపై కూడా మిస్సైల్ దాడి జరిగింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఉక్రెయిన్ను భూమిపై లేకుండా రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. దేశంలోని పలు నగరాలపై చేసిన క్షిపణి దాడుల్లో అనేక మంది మరణించారని, చాలా మంది అమాయకులు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ బలగాలు పేల్చేసిన సంగతి తెలిసిందే. ట్రక్కు బాంబులతో అ వంతెనను పేల్చేసినట్టు సమాచారం.. అయితే బ్రిడ్జిపై ట్యాంకర్ పేలడంతో కెర్చ్ వంతెన కూలినట్టు రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఈ పేలుడుతో క్రిమియాతో రష్యాకు లింక్ తెగిపోయింది. బ్రిడ్జి పేల్చివేతపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పేలుడులో ఉక్రెయిన్ పాత్ర ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా సాయంతో ఉక్రెయిన్ బలగాలు ఈ వంతెనను పేల్చేసినట్టు రష్యా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలానికి డిటెక్టివ్లను పంపినట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది.
Rajasthan: ఒంటరి మహిళలే టార్గెట్.. ఎదిరిస్తే బెదిరింపులు.. కత్తులతో దాడులు
క్రిమియా బ్రిడ్జిపై దాడి తర్వాత రష్యా అణ్వాయుధాల వినియోగానికి మరింత దగ్గరైందని ప్రపంచం భయపడుతోంది. ఈ ఘటనకు ఏ దేశం, సంస్థ బాధ్యత తీసుకోకపోయినా మాస్కో అనుమానాలు ఉక్రెయిన్పైనే ఉన్నాయి. ట్రక్కు బాంబు సాయంతో ఈ దాడి జరిగినట్లు తొలుత అంతా భావించారు. కానీ, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సమాచారం.. నిపుణుల విశ్లేషణలు.. క్రిమియా ద్వీపకల్పం బీచ్ల్లో గత కొంతకాలంగా చోటు చేసుకొన్న పరిణామాలు కలిపి చూస్తే.. ఓ పెద్ద మాస్టర్ప్లాన్ ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..