Divyang Shakti Scheme: నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం!
- ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకం ప్రారంభం
- నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
- ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divyang Shakti Scheme AP: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్దమైంది. దివ్యాంగుల సంక్షేమానికి కీలకమైన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఇవాళ ఉదయం 11.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొంటారని పాల్గొననున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు మరింత సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
దివ్యాంగ శక్తి పథకం కింద ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంతటా దివ్యాంగులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ముఖ్యంగా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తించనుంది. ఇప్పటికే అమలులో ఉన్న 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే కాకుండా.. ఇప్పుడు 21 వర్గాల దివ్యాంగులకు ఈ పథకాన్ని విస్తరించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు కూడా ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. వారికి బస్సు చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 12.76 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులు లబ్ధి పొందనున్నారు.
Also Read
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
- Geetu Mohandas: "నేను రాసిందొకటి.. తీసిందొకటి".. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
Also Read: IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!
దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.207 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. మొత్తానికి ‘దివ్యాంగ శక్తి’ పథకం దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ప్రారంభోత్సవం కోసం సీఎం చంద్రబాబు ఉదయం 11.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. రోడ్డు మార్గం ద్వారా 11.30కు మంగళగిరి ఆర్టీసీ బస్స్టాండ్కు చేరుకుంటారు. 11.35కు పథకాన్ని ప్రారంభించి.. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు.
తాజావార్తలు
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!