BJP: బీజేపీ లోక్సభ అభ్యర్థి హఠాన్మరణం.. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ లోక్సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ (72) హఠాన్మరణం చెందారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం దేశ వ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సర్వేష్ సింగ్ బరిలో ఉన్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్లో ఆయన ఓటు కూడా వేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోకి ఎయిమ్స్కు తరలించారు. అనంతరం ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ధృవీకరించారు.
శుక్రవారం పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే అభ్యర్థి మరణించడంతో యూపీలోని మొరాదాబాద్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మొరాదాబాద్లోని ఠాకూర్ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 2014లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
Also Read
సర్వేష్ సింగ్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మొరాదాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మరణం షాక్కు గురిచేసిందన్నారు. ఇది బీజేపీ కుటుంబానికి తీరని లోటు అని.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు శక్తిని ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. సర్వేష్ సింగ్ మృతి పట్ల బీజేపీ నేతలంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.
సర్వేష్ సింగ్ మృతి పట్ల యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. దు:ఖంలో ఉన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సర్వేష్ సింగ్ ఆత్మకు శాంతి కూరాలని ప్రార్థిస్తున్నట్లు అఖిలేష్ ట్వీట్ చేశారు.
मुरादाबाद लोकसभा क्षेत्र से भाजपा प्रत्याशी एवं पूर्व सांसद कुंवर सर्वेश सिंह जी के निधन से स्तब्ध हूं। ये भाजपा परिवार के लिए अपूरणीय क्षति है।
मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान तथा…
— Yogi Adityanath (@myogiadityanath) April 20, 2024
తాజావార్తలు
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!