ఒడిశాలోని మయూర్భంజ్ లోక్సభ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరి అంజనీని జేఎంఎం ప్రకటించింది. అంజనీ సోరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కుమార్తె. మయూర్భంజ్ స్థానం నుంచి అంజనీ సోరెన్ పోటీలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పొరు నెలకొంది.
బీజేపీ లోక్సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ (72) హఠాన్మరణం చెందారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.