Prajwal Revanna: వీడియోల లీక్పై కుమారస్వామి తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అభ్యంతరకర వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాలనే కాకుండా.. యావత్తు దేశాన్ని కుదిపేసింది. పెన్డ్రైవ్లో వందలాది వీడియోలు భయటపడ్డాయి. మరోవైపు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. అయితే ఈ వీడియోల లీక్ వెనుక భారీ కుట్ర జరిగిందని కర్ణాటక ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: PM Modi: “ఇండీ కూటమి మరింత ఆవిరైపోతోంది”.. మూడో దశ తర్వాత పీఎం ట్వీట్..
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఎన్నికల ముందు అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్డ్రైవ్లను పంచారని కుమారస్వామి విమర్శించారు. ఈ కుట్ర వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమాజంలో జరగకూడని ఒక అంశం గురించి మాట్లాడేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. మొదట బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్డ్రైవ్ను విడుదల చేశారని.. ఇది ఏప్రిల్ 21న జరిగిందని తెలిపారు. ఆ రోజు రాత్రి ఒక వాట్సాప్ ఛానల్ను క్రియేట్ చేశారని.. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు వీక్షించేందుకు ఈ ఛానల్ను ఫాలో అవ్వండని అందులో మెసేజ్ పెట్టారన్నారు.
ఇది కూడా చదవండి: DC vs RR: హాఫ్ సెంచరీలతో మెరిసిన మెక్గుర్క్, అభిషేక్ పోరెల్.. ఆర్ఆర్ టార్గెట్ 222..
వీడియోల్లో ఉన్న దేనినీ తాను సమర్థించడం లేదని కుమారస్వామి చెప్పారు. చట్టపరంగా తప్పు చేసినవారికి శిక్ష పడాలన్నారు. అలాగే ఆ వీడియోలను పంచిన విషయంలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదైందని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. సిట్ను ఏర్పాటు చేసినప్పుడు న్యాయం జరుగుతుందని తాను భావించానని.. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదన్నారు. అధికారంలో ఉన్నవారు సిట్ సభ్యుల్ని వారి ఇంటికి పిలిచి, కేసు గురించి మాట్లాడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ముగ్గురు జేడీఎస్ అభ్యర్థులు ఓడిపోతారని సిద్ధరామయ్య ధీమాగా చెప్పారని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. అలాగే పోలీసు అధికారుల సహాయంతో ఆ పెన్డ్రైవ్ల పంపిణీ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: Kothapalli Geetha: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొత్తపల్లి గీత..
ఇదిలా ఉంటే ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇప్పటికే ఆయనకు సిట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ప్రజ్వల్.. హాసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కానీ ఆయన ప్రచారం చేయకుండా.. పరారీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!