KTR: ఫార్ములా ఈ- కార్ రేస్ కేసుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్..
- ఫార్ములా ఈ రేస్ ఇష్యూపై కేటీఆర్ మీడియా సమావేశం
- ఫార్మూలా ఈ-కార్ రేస్పై అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాం-కేటీఆర్
- ఈ కేసులో ఏం లేదని ప్రభుత్వానికి కూడా తెలుసు-కేటీఆర్
- దీనిపై సీఎం రేవంత్కు కూడా లేఖ రాశాను-కేటీఆర్
- సీఎం రేవంత్కు చర్చ పెట్టే దమ్ములేదు, చర్చలో పాల్గొనే ధైర్యం లేదు-కేటీఆర్
- కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడే పరిస్థితి లేదు-కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ రేస్ ఇష్యూపై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా తనపై కేస్ అని లీక్లు ఇస్తున్నారు.. నాలుగు గోడల మధ్య ఎందుకు.. అసెంబ్లీలో చర్చ పెట్టండి అని అడిగానన్నారు. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశానని కేటీఆర్ తెలిపారు. అయినా చర్చకు వచ్చే దమ్ము లేదు ప్రభుత్వానికి అని పేర్కొన్నారు. అసలు ఏమి జరిగిందో ప్రజలకు చెప్పాలని మీడియా సమావేశం పెట్టానన్నారు. హైదరాబాద్లో రేసింగ్ రావాలని చాలా ప్రయత్నాలు గతంలో జరిగాయి.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫార్ములా రేసింగ్ కోసం ఎంతో ప్రయత్నం చేశాడన్నారు. 2003 ప్రాంతంలో ఫార్ములా ఈ రేసింగ్ సీఈవోను కలిసి హైదరాబాద్ కు రావాలని అడిగారు.. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడంతో హైదరాబాద్ రేసింగ్ రాలేదని తెలిపారు. అప్పట్లోనే గోపన్ పల్లిలో రేసింగ్ కోసం 500 ఎకరాలు సేకరించారని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Devendra fadnavis: అజిత్ పవార్ ఏదొక రోజు సీఎం అవుతారు.. ఫడ్నవిస్ జోస్యం
Also Read
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
ప్రభుత్వం సేకరించిన 500 ఎకరాల్లో రేవంత్ రెడ్డికి కూడా15 ఎకరాలు ఉందని కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాద్కు రేసింగ్ రాలేదని చెప్పారు. మన దేశంలో కూడా ఈ రేసింగ్ రావడం కోసం ఎంతో అడిగారు.. ఉత్తరప్రదేశ్లో 2009, 10, 11లో రేసింగ్ జరిగిందన్నారు. అందుకోసం యూపీలో 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.. ఈ రేసింగ్ కోసం దేశంలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది.. ఇక ఈ రేసింగ్ కోసం ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చాయన్నారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము కూడా ఈ ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకు రావాలని ప్లాన్ చేశామని తెలిపారు. ఆటోమొబిల్ రంగంలో తెలంగాణను నెంబర్ వన్ గా చేయాలి అనుకున్నామని కేటీఆర్ తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ అడ్డా చేయాలి అనుకున్నాం.. ఫార్ములా ఈ వాళ్ళను కలిసి హైదరాబాద్ రావాలని బతిమిలాడామని కేటీఆర్ తెలిపారు. 2022 అక్టోబర్లో ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం.. 2023 ఫిబ్రవరిలో రేసింగ్ జరిగిందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పలువురు క్రీడాకారులు, నటులు కూడా ఈ రేసింగ్ కోసం వచ్చారని పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరిలో రేస్ జరిగింది.. దీనికి హెచ్ఎండీఏ ఖర్చు పెట్టింది.. హెచ్ఎండీఏ నుంచి రూ. 30, 35 కోట్లు ఖర్చు పెట్టామని కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!