KTR: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
- సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు
- రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ఇస్తలేరు అని సీఎం రేవంత్ అంటున్నారు.. ఎందుకు ఇస్తలేరు.. సీఎం స్వయంగా చెప్తున్నరు అపాయింట్ మెంట్ ఇస్తే చెప్పులెత్తుకపోతరేమోనని ఇస్తలేరని అంటున్నడు.
Also Read:Telanagana Assembly: గంగుల కమలాకర్ పై మంత్రులు సీరియస్..
Also Read
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి 250 సరుకులు.. రూ.5 తక్కువకే..
- Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
- Nirav Modi: నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం! మూసుకున్న న్యాయ మార్గాలు
ఇట్ల మాట్లాడాకా అపాయింట్ మెంట్స్ వస్తయా అని ప్రశ్నించారు. భాష మార్చుకో.. బుద్ధి మార్చుకో అని కేటీఆర్ సూచించారు. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మొట్టమొదటి స్పీకర్గా బలహీనవర్గాల బిడ్డ మధుసూదనాచారిని, శాసన మండలి తొలి ఛైర్మన్గా స్వామిగౌడ్ను నియమించాం. అడ్వకేట్ జనరల్గానూ బలహీనవర్గానికి చెందిన బీఎస్ ప్రసాద్ను భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం నియమించింది. కె.కేశవరావు, డి.శ్రీనివాస్ (డీఎస్), బండా ప్రకాశ్, లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభకు నామినేట్ చేశాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read:Rashmika : మరో హారర్ చిత్రంలో రష్మిక?
అంతకు ముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారు.. తెరవెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపించేలా చేశారు.. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దుఖంతో ఉన్నారు.. బీసీ రిజర్వేషన్లపై హరీష్ రావు, కేటీఆర్ కడుపు నిండా విషం పెట్టుకుని ఉన్నారు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం.. కానీ బీఆర్ఎస్ మాత్రం మద్దతు తెలపలేదు.. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ కు లేదు.. మేము సహకరించం, మా బుద్ధి మారదు అంటే.. ప్రజలే సమాధానం చెప్తారు.. మీరు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు.. ముందు మీ నాయకుడిని సభకు రమ్మనండి.. కేసీఆర్ సభకు రాడు.. వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు.. కల్వకుంట్ల కాదు.. కలవకుండా చేసే కుటుంబం.. అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి 250 సరుకులు.. రూ.5 తక్కువకే..
-
Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
-
Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
-
Nirav Modi: నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం! మూసుకున్న న్యాయ మార్గాలు
ట్రెండింగ్
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!