Telanagana Assembly: గంగుల కమలాకర్ పై మంత్రులు సీరియస్..
- గంగుల కమలాకర్ పై మంత్రులు సీరియస్
- మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సీరియస్
- ఆకారాలు పెద్దగ ఉంటే..అవగాహన ఎక్కువ ఉంటది అనుకోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగుల కమాలకర్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. సభలో గంగుల మాట్లాడుతూ.. మంత్రికి వాస్తవాలు తెలియదు.. నేను అడిగిన వాటికి సీఎం క్లారిటీ ఇవ్వాలి అని అన్నారు. గంగులు వ్యాఖ్యలతో హీట్ పెరిగింది. ఆకారాలు పెద్దగ ఉంటే..అవగాహన ఎక్కువ ఉంటది అనుకోవద్దు అని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అవగాహన లేదు అంటున్నారు.. ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాను. రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఉన్నా.. మంత్రికి అవగాహన లేదని మాట్లాడటం పొరపాటు.. గంగుల వ్యాఖ్యలను వెనక్కి తీసీుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:Jailer 2 : జైలర్ 2’లో బాలీవుడ్ హాట్ బ్యూటీ..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
దీనికి బదులుగా గంగుల మాట్లాడుతూ.. నేను బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే చాలా కాంట్రవర్సీ అవుతుంది. ముఖ్యమంత్రి సభలో ఉన్నారు. నేను తప్పు మాట్లాడలేదు.. అతనికి అవగాహన లేదని ఎందుకు అన్నానంటే..అని చెప్పబోతుండగా.. ముఖ్యమైన బిల్లుపై చర్చ జరుగుతుంటే చిన్న చిన్న అంశాలను పట్టుకుని రాద్దాంతం చేయడం కరెక్ట్ కాదన్నారు శ్రీధర్ బాబు. మంత్రిని ఉద్దేశించి అవగాహన లేదని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రిని.. బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరుగుతుంటే ఇలా మాట్లాడడం సరికాదన్నారు. సభా సంప్రదాయాలకు విరుద్దంగా మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. గంగుల కమలాకర్ గతంలో మంత్రిగా పనిచేశారు. బలహీన వర్గాలు పడుతున్న బాధ ఏంటో ఆయనకు తెలుసు. చారిత్రాత్మకమైన బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలని కోరారు.
Also Read:NBK : వాళ్లు లేకుంటే నేను లేను.. ఈ రికార్డులు.. అవార్డులకు వాళ్లే కారణం : నందమూరి బాలకృష్ణ
స్పీకర్ మాట్లాడుతూ.. రెండో సారీ మంత్రి అప్పీల్ చేశారు.. పొన్నంపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని గుంగులకు సూచించారు. మా హక్కులనున కాపాడండి అని గంగుల స్పీకర్ ను కోరారు. మాకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు.. అంతరాయం కలగకుండా చూసే బాధ్యత మీదే అని తెలిపారు. దీంతో స్పీకర్ మాట్లాడుతూ మీ హక్కులు కాపాడతాం.. కానీ మిమ్మల్ని తిట్టించుకునే మాటలు మాట్లాడకండి అని అన్నారు. పర్సనల్ గా మాట్లాడొద్దు అని చెప్పండి మంత్రులకు అని గంగుల అనడంతో ఆ అవకాశం ఇవ్వకండి మీరు అని స్పీకర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
తాజావార్తలు
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!