KTR : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శల వర్షం
- SLBC టన్నెల్ ప్రమాదం – రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
- రేవంత్ పాలనపై విమర్శలు – అప్పులు, హామీలు
- సీఎంగా అవకాశం వచ్చింది కనీసం రాష్ట్రానికి మంచి చేసే దిశగా పనిచేయాలి : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణలో ఇటీవల జరుగుతున్న మిస్టీరియస్ మరణాల (Mystery Deaths) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులపై బోరింగ్ ప్రసంగాలు ఇస్తూ, పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్ర పాలన నిర్వహించే బాధ్యత తనపై ఉందన్న విషయాన్ని మరిచిపోయి, అసంబద్ధ ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
“ఒక ముఖ్యమంత్రి (Chief Minister) లాగా మాట్లాడాలి కానీ, చీప్ మినిస్టర్ (Cheap Minister) లా కాదు” అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మిస్టీరియస్ మరణాలపై నిజాయితీ ఉంటే విచారణ చేయించుకోవచ్చని, కానీ బ్లేమ్ గేమ్ (Blame Game) ద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించడం సరైన విధానం కాదన్నారు.
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదం గురించి స్పందించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టి తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
“ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహారం సాగుతోంది. జిఎస్ఐ (GSI), ఇంజనీరింగ్ నిపుణులను సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టును పాత యంత్రాలతో తిరిగి ప్రారంభించారు. కేవలం అవినీతి డబ్బు కోసమే ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ ప్రాజెక్టును ప్రారంభించారని” మండిపడ్డారు.
ఈ అశ్రద్ధ కారణంగా ఎనిమిది మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని, వారి ప్రాణసంకటానికి రేవంత్ రెడ్డే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. “కార్మికులను కాపాడాల్సింది పోయి, బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. ఇది అత్యంత బాధాకరం” అని అన్నారు.
Shikhar Dhawan: ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు నెగ్గాలో.. రోహిత్కు బాగా తెలుసు
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయినందున ప్రజల దృష్టి మరల్చేందుకు మిస్టీరియస్ మరణాల విషయాన్ని లేవనెత్తుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గత 15 నెలలుగా ఆయన కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు దివERSION పాలిటిక్స్ నడుపుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్ర అప్పుల విషయంపై కూడా రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి రూ. 6,500 కోట్లలో కేవలం వడ్డీ చెల్లింపులే ఉన్నాయని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. “రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడమే ఇది నిరూపిస్తుంది” అని విమర్శించారు.
“రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది, కనీసం రాష్ట్రానికి మంచి చేసే దిశగా పనిచేయాలి. కానీ, రాజకీయ డ్రమాలు ఆడుతూ, ప్రజలను మోసగించడమే ఆయన పని అయింది” అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని, ప్రజలతో కలిసి మళ్లీ బలమైన రాజకీయ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Nandamuri Balakrishna: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!