Site icon NTV Telugu

KTR: కేసీఆర్ను విచారణకు పిలవడం మీ అహంకారం కాకపోతే మరేమిటి?.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్!

Ktr

Ktr

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ రే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అన్నారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? అని అడిగారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు.. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా?.. లేక మీ చేతిలో కీలు బొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? అని కేటీఆర్ మండిపడ్డారు.

Read Also: Family Suicide: హైదరాబాద్లో పెను విషాదం.. రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న ఓ కుటుంబం..

అయితే, చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు.. కానీ మాకు వాటి మీద పూర్తి విశ్వాసం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తాం.. మీ ప్రతి తప్పుడు పనిని వెలికి తీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని పేర్కొన్నారు. మీరు ఎన్ని వేధింపులకు పాల్పడుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్ధి చెబుతారని కేటీఆర్ ఎక్స్ లో పెట్టిన పోస్టులో రాసుకొచ్చారు.

Exit mobile version