CPM Srinivasa Rao: సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు..
- సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు..
- ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలి..
- బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు నిర్మించి వారికి అన్యాయం చేస్తున్నారు: సీపీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM Srinivasa Rao: ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. ఆ లేఖలో ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని 27వ తేదీన విశాఖపట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాల్సింది పోయి సవరించాలని చెప్పడం ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది అని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతం రాజ్యాంగం 5వ షెడ్యూలు కిందకు వస్తుంది.. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయి.. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు.. ఇప్పుడు 1/70ని సవరించడం వల్ల గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని శ్రీనివాసరావు చెప్పారు.
Read Also: Thief: సినీ నటితో ప్రేమలో పడిన దొంగ.. ఏకంగా రూ. 3 కోట్లతో ఇల్లు..
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
ఇక, 1/70 చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతో కొంత భూమిపై అధికారం వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. 2006-07లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం వామపక్ష పార్టీల ఒత్తిడితో అటవీ సంరక్షణ చట్టాన్ని తెచ్చింది.. భూమిపై గిరిజనుల హక్కులను ఈ చట్టం బలోపేతం చేసింది.. పంప్డ్ స్టోరేజీ హైడల్ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన ప్రాంతాలు 1/70ని సవరించడంతో మరింత వెనకబడిపోతాయన్నారు అని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!