KTR: రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారు.. ప్రచారానికి సిద్ధం అవ్వండి!
- కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన రాజేంద్రనగర్ నేతలు
- రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారు
- మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా?
- నలబై వేల బస్సులు మీటింగ్కు వస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో జరిగే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదని.. ప్రజలే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలకు ముసలోళ్లు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారన్నారు. మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? అని, బీజేపీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగవని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘తొందర్లోనే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారు. గత ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదు.. ప్రజలే. ఔటర్ లోపల చాలా సీట్లు గెలిచాం. రేవంత్ రెడ్డి మాయమాటలకు ముసలోళ్లు, మహిళలు , నిరుద్యోగులు మోసపోయారు. వీళ్ళు చెబితే నమ్మరని.. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో 420 హామీలు ఇప్పించారు. ఒక్కసారి అవకాశం ఇద్దామని మన వారు ఓట్లు వేశారు. అభివృద్ధి చేసిన వైఎస్సార్, చంద్రబాబు గురించి ఇంకా మనం చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పనులు చేయరు. ఫ్రీ బస్ తప్ప ఏమీ చేయలేదు, దాని గురించి మాట్లాడితే మళ్లీ కేసులు పెడతారు’ అని కేటీఆర్ అన్నారు.
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
‘మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా?. బీజేపీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగవు. చేవెళ్ల, రాజేంద్రనగర్లలో ఈ ఏడాది తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు రావు అన్నందుకు సీఎం రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పటి నుంచే ప్రచారానికి సిద్ధం అవ్వండి. ఈ నెల 27 జరగబోయే వరంగల్ సభను విజయవంతం చేయండి. నాయకులు కూడా బస్సులలో కార్యకర్తలతో కలిసి మీటింగ్కు రావాలి. సబితా ఇంద్రారెడ్డి కూడా బస్సులోనే మీటింగ్ వస్తారు. నలబై వేల బస్సులు మీటింగ్కు వస్తున్నాయి’ అని కేటీఆర్ చెప్పారు.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!