KTR : లై డిటెక్టర్ పరీక్ష జరిపిద్దాం… మీడియాలో లైవ్ చూపిద్దాం…
- రాజకీయ కక్షసాధింపులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టింది
- ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి.. ఈడీ కూడా ప్రశ్నించింది
- ఏసీబీ, ఈడీ సంస్థల ప్రశ్నలు ఒకేరకంగా ఉన్నాయి
- ఎన్నిసార్లు విచారణకు పిలిచినా నేను సిద్ధం :కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7 గంటలపాటు ఈడీ అధికారులు కేటీఆర్ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఈడీ విచారణ తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ కక్ష సాధిస్తున్నారని, నేను నిజాయతీ పరుడినన్నారు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండని, రేవంత్ రెడ్డి ఇంట్లో అయిన, న్యాయమూర్తులు సమక్షంలో లై డిటెక్షన్ రెడీ అని ఆయన అన్నారు. ఎన్ని పరీక్షలకయినా సిద్ధమని, విచారణకి 5కోట్ల నుండి 10కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. విచారణ సంస్థలను గౌరవించి ఏసీబీ, ఈడీ విచారణ కి హాజరు అయ్యానని, రెండు సంస్థలు ఒకే రకమైన ప్రశ్నలు ఆడిగారన్నారు కేటీఆర్. ఎన్ని ప్రశ్నలు అడిగిన చెబుతా అని, ఎన్ని సార్లు రమ్మని చెప్పిన వస్తా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
NEET-UG 2025: పెన్-పేపర్ పద్ధతిలో నీట్.. ఒకే రోజు, ఒకే షిఫ్ట్లో పరీక్ష..
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
అంతేకాకుండా..’విచారణ కి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ముఖ్యమంత్రి పై ఏసీబీ కేసు కేసు ఉంది కాబట్టి నా మీద కేసు బనాయించారు… రేవంత్ రెడ్డి కి ఒక ఆఫర్ ఇస్తున్న… నువ్వు ముందుకు రా నీకు ఇష్టమైన ఒక జడ్జ్ ముందు కూర్చుందాం.. నీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది… లై డిటెక్టర్ పరీక్ష జరిపిద్దాం… మీడియాలో లైవ్ చూపిద్దాం… 10 ,20 లక్షలు ఖర్చు మొత్తంలో అయిపోతుంది… దొంగ ఎవరో నిజాయితీగా ఉన్నది ఎవరు? అప్పుడే తెలుస్తుంది… ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్నిసార్లైనా విచారణకు హాజరవుతా.. న్యాయం ధర్మం కచ్చితంగా గెలుస్తుంది.. అర పైసా అవినీతి జరగలేదని ఎనిమిది గంటల పాటు అడిగిన అదే విషయాన్ని చెప్పాను…’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!