KTR : ఈ ఉడత ఊపులకు భయపడం.. ఏ కేసు పెట్టుకుంటవో పెట్టుకో..!
- టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టినప్పటినుంచి తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడింది
- తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిననాడే చావు తెగించి వచ్చాం
- ఉద్యమ సమయంలో చంద్రబాబు.. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినం : కేటీఆర్
KTR : టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టినప్పటినుంచి తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో ముఖాముఖి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిననాడే చావు తెగించి వచ్చామని, ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినమని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న చిట్టినాయుడి అని, ఆ చిట్టినాయుడు ఏదో కేసు పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అంటే భయపడేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పొలిటికల్ బాంబులు పేలుతై అంటే.. ముందు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలూ.. అమృత్ స్కాంలో రేవంత్ రెడ్డి బావమరిది 1,137కోట్ల వర్క్ ఇచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు. అర్హత లేని కంపెనీకి అమృత్ స్కీంలో స్కాం చేస్తే ఎందుకు కాపాడుతుందో సమాధానం కావాలన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై జరిగిన రైడ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని, అదానీని పొంగులేటి రహస్యం కలుసుకోవడం.. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అక్రమ సంబంధానికి నిదర్శనమన్నారు.
Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన 7 మంది షూటర్లు అరెస్ట్
Also Read
- Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
- Fennel Sharbat Recipe: వేసవికి చల్లని ప్రత్యేక పానీయం.. షుగర్, మసాలా లేకుండా చిటికెలో తయారయ్యే సోంపు షర్బత్..!
- Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్షీట్ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది...!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకే మాపై కేసులు పెడుతామంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. కేసులు పెడితే భయపడేది లేదని.. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునే ఉంటామన్నారు కేటీఆర్. రైతు రుణమాఫీ, రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారని అడుగాతామని, ఆరు గ్యారెంటీల ఎందుకు అమలు చేస్తలేరో ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచుతున్నమని ప్రతిపాదన వస్తే బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని రక్షణ కవచంలాగా బీజేపీ కాపాడుతుంటే రాష్ట్ర ప్రజలు చూస్తలేరా.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ప్రజలు అమాయకులు అనుకోవడం రేవంత్ రెడ్డి అజ్ఞానమన్నారు. దేశంలో ‘ఆయారాం.. గయారాం’ సంస్కృతిని తీసుకువచ్చింది ఇందిరాగాంధీ కాదా అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ను వ్యాపరంగా ప్రభుత్వం చూడొద్దని.. బాధ్యతగా చూడాలన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్ర ఆదాయం పెంచి ఖజానా నింపాలని, కానీ.. పేద ప్రజలపై భారీ మోపి ఆదాయం దండుకోవడం కరెక్ట్ కాదన్నారు.
Maldives: భారత్ దెబ్బతో మల్దీవులు కుదేలు.. అధ్యక్షుడి జీతం దానం.. ఉద్యోగుల శాలరీల్లో కోత!
తాజావార్తలు
-
Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
-
Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్లకే ఎలా సాధ్యం?
-
Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
-
Fennel Sharbat Recipe: వేసవికి చల్లని ప్రత్యేక పానీయం.. షుగర్, మసాలా లేకుండా చిటికెలో తయారయ్యే సోంపు షర్బత్..!
-
May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!