Maldives: భారత్ దెబ్బతో మల్దీవులు కుదేలు.. అధ్యక్షుడి జీతం దానం.. ఉద్యోగుల శాలరీల్లో కోత!
- క్షీణిస్తోన్న మాల్దీవుల ఆర్థిక పరిస్థితి
- ఖర్చు తగ్గింపును ప్రకటించిన అధ్యక్షుడు
- 50 శాతం తీసుకోబోమని ప్రకటన
- ఉద్యోగులు జీతాల్లో కోత
- భారత్ పై మహ్మద్ ముయిజ్జూ వైఖరితో ఈ పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం పొరుగున ఉన్న మాల్దీవుల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్థిక సంస్కరణల ప్రయత్నాల్లో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఖర్చు తగ్గింపును ప్రకటించారు. మహ్మద్ ముయిజ్జూ తన జీతంలో 50 శాతం తీసుకోబోరని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, మాల్దీవులలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించబడుతుంది. బ్యాంకులు మినహా అన్ని రాజకీయ నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో 10 శాతం కోత విధించనున్నారు.
వారి జీతంలో కోత ఉండదు
న్యాయమూర్తులు, ఎంపీలకు కోత నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే.. 10 శాతం కోతకు స్వచ్ఛందంగా అంగీకరించడం ద్వారా భారాన్ని పంచుకుంటామని ముయిజు కార్యాలయం ఆశాభావం వ్యక్తం చేసింది. రెండు వారాల క్రితం.. ముయిజ్జు భారాన్ని తగ్గించుకోవడానికి మంత్రులతో సహా 225 మందికి పైగా రాజకీయ నియామకాలను తొలగించారు. తొలగించబడిన వారిలో ఏడుగురు రాష్ట్ర మంత్రులు, 43 మంది డిప్యూటీ మంత్రులు, 178 మంది రాజకీయ డైరెక్టర్లు ఉన్నారు. ఈ చర్యతో దేశం ప్రతి నెలా $370,000 ఆదా చేస్తుందని భావిస్తున్నారు.
Also Read
- Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
- Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
- CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
మాల్దీవుల విదేశీ మారకద్రవ్య నిల్వల పరిస్థితి?
క్షీణిస్తున్న విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఆందోళనల మధ్య ముయిజ్జూ ప్రకటన వెలువడింది. మాల్దీవుల విదేశీ మారకద్రవ్య నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయని ప్రపంచ బ్యాంకు తన తాజా నవీకరణలో పేర్కొంది. విదేశీ రుణాల చెల్లింపు కారణంగా లిక్విడిటీ రిస్క్ పెరుగుతోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు 2017 నుంచి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మాల్దీవుల వద్ద ఉన్న నిల్వలు ఒక నెల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. 2024 మొదటి త్రైమాసికంలో దేశం యొక్క అప్పు అంచనా $8.2 బిలియన్లు లేదా జీడీపీలో115.7 శాతం.
మహ్మద్ మయిజ్జు వల్లే ఈ పరిస్థితి..?
గతంలో భారత్కు, మాల్దీవులకు మధ్య అంతా బాగానే ఉండేది. పొరుగుదేశంగా, పెద్దదేశంగా, మిత్రదేశంగా ఉన్న భారత్తో మాల్దీవులు ఎంతో స్నేహంగా, జాగ్రత్తగా ఉండేది. ఆ దేశానికి కొత్తగా అధ్యక్షులు అయిన వాళ్లెవరైనా ముందుగా భారత్లోనే పర్యటించేవారంటే రెండు దేశాల మధ్య బంధం ఎంత బలంగా ఉండేదో అర్ధంచేసుకోవచ్చు. కానీ మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడయిన తర్వాత అంతా మారిపోయింది. భారత్ను వ్యతిరేకించడం, మనతో నిరంతరం గొడవలు పెట్టుకునే చైనాకు విశ్వాసంగా ఉండడం, చైనాకు వీలయినంత దగ్గరగా ఉండడాన్ని మాల్దీవుల విదేశాంగ విధానంగా మార్చేందుకు ముయిజ్జూ ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్ను రెచ్చగొట్టడం, మనకు దూరం జరగడం ద్వారా దేశంలోనూ, ప్రపంచస్థాయిలోనూ గుర్తింపు పొందడమే మయిజ్జు లక్ష్యాలుగా మారిపోయాయి. ఆ దేశానికి అతి ముఖ్యమైన ఆర్థిక వనరు టూరిజం. మన దేశం నుంచి అత్యధికంగా పర్యటకులు ఆదేశానికి వెళ్లే వాళ్లు. భారత్పై మాల్దీవుల వైఖరితో పర్యటకులు లక్షదీప్ కు వెళ్లేందుకు మొగ్గుచూపారు. దీంతో ఆదేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది.
తాజావార్తలు
-
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
-
Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
-
Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్లో కొత్త టూరిజం హబ్
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?