KTR : హైడ్రా దెబ్బకు రియల్ఎస్టేట్ పడిపోయింది.. కొత్తవి కొనాలన్నా.. పాతవి అమ్మాలన్నా భయమే
- హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కేవలం బ్లాక్ మెయిల్ దందా
- హైడ్రా విధానాల వల్ల రియల్టర్లు.. బిల్డర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు
- ప్రభుత్వ పాలన వల్ల భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కేవలం బ్లాక్ మెయిల్ దందా చేసే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధానాల వల్ల భూములు అమ్మడంలో జాప్యం అవుతూ రియల్టర్లు, బిల్డర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ పాలన వల్ల భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం బిల్డర్లకు కనీసం పర్మిషన్లు కూడా పొందడం చాలా కష్టమైంది. బిల్డర్లు ఎక్కువ పెట్టుబడులు పెట్టి, కానీ భూములు అమ్మలేకనే పోతున్నారు’’ అని ఆయన తెలిపారు.
Delhi: ఢిల్లీలో రెచ్చిపోయిన గ్యాంగ్స్టర్లు.. షోరూమ్పై కాల్పులు.. రూ.10 కోట్ల డిమాండ్
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అలాగే, ఇటీవల ఒక పెద్ద బిల్డర్ మాట్లాడుతూ ‘‘రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత గట్టి జాప్యం కలిగిస్తున్నాయి. ఒక సంవత్సరంలో పరిస్థితి మారకపోతే చిన్న బిల్డర్లంతా పోటీలో పడిపోతారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, ‘‘రియల్ ఎస్టేట్ రంగాన్ని ముఖ్యమంత్రి గమనించరు. 11 నెలలు పూర్తి అవుతున్నప్పటికీ ఎలాంటి సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ‘హైడ్రా’ పేరుతో బ్లాక్ మెయిల్ దందా చేస్తున్నారు. ప్రజల సొమ్ము కూడా బిల్డర్ల చేతుల్లో పడకపోవడంతో మార్కెట్లో డబ్బులు లేకుండా పోయాయి’’ అని మండిపడ్డారు.
Aishwarya: ఐశ్వర్యను ఒంటరిగా వదిలివేసి.. ఆమె పక్కన కూర్చున్న అభిషేక్?
ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది, కానీ హెచ్ఎండీఏ పరిధిలో మాత్రం భద్రతా కారణాలతో రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం మధ్యతరగతి ప్రజలకు మిగతా నష్టాన్ని కలిగిస్తుంది. ‘‘ఈ పరిస్థితి ప్రభుత్వం చేయి తప్పిన నిర్ణయాల వలన ఏర్పడింది’’ అని కేటీఆర్ అన్నారు. హైడ్రా పేరుతో అనాలోచితంగా భవనాల కూల్చివేత వల్ల, ‘‘ఒక గర్భిణీ మహిళ 40 ఏళ్ల వయసులో ఎలా ఈఎంఐ కట్టాలని ప్రశ్నించింది’’ అని ఆయన అన్నారు. మార్కెట్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తుంటే, ‘‘ప్రభుత్వం మేల్కొన్నప్పుడే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సహకరిస్తాం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. “ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే, మేము ముఖ్యమైన ప్రతిపక్షంగా పోరాటం చేయడం కొనసాగిస్తాం’’ అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!