Delhi: ఢిల్లీలో రెచ్చిపోయిన గ్యాంగ్స్టర్లు.. షోరూమ్పై కాల్పులు.. రూ.10 కోట్ల డిమాండ్
- ఢిల్లీలో రెచ్చిపోయిన గ్యాంగ్స్టర్లు
- షోరూమ్పై ముగ్గురు కాల్పులు
- రూ.10 కోట్ల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు గ్యాంగ్స్టర్లు రెచ్చిపోయారు. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఏ మాత్రం భయం లేకుండా ముఠా సభ్యులు బరితెగించారు. వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్లోకి ప్రవేశించి ఇష్టానురీతిగా గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం భారీగా నగదు డిమాండ్ చేసిన ఒక నోట్ను విడిచిపెట్టి వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Solar Car: సోలార్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఒక్క ఛార్జింగ్తో 1600 కి.మీ.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్ ప్రాంతం. పట్టపగలు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి చోటికి సోమవారం జితేంద్ర గోగి గ్యాంగ్కు చెందిన షూటర్లు.. షోరూమ్పై కాల్పులు జరిపారు. ఒకరు షోరూమ్ లోపలికి వెళ్లి బెదిరించగా.. ఇంకో ఇద్దరు బయట ఉండి గాల్లోకి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఒక నోట్ను అక్కడ వదిలిపెట్టారు. దోపిడీ నోట్లో గోగి మరో గ్యాంగ్స్టర్ కుల్దీప్ ఫజ్జాతో ఉన్న ఫొటో ఉంది. దానిపై ‘‘యోగేష్ ధైయా’’, ‘‘ఫజ్జే భాయ్’’ మరియు ‘‘మోంటి మన్’’ పేర్లు మరియు ‘‘10 కోట్లు’’ అని వ్రాయబడి ఉంది. ఇలా బెదిరింపు లేఖను వదిలిపెట్టి వెళ్లారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Hyderabad New Traffic Rules : ఇక హెల్మెట్ లేకుండా బయటకు వస్తే మోతే
సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు వ్యక్తులు షోరూమ్ ప్రవేశ ద్వారం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముఖాలు కప్పబడి.. ఆయుధాలు ధరించారు. లోపలికి వెళ్లిన వ్యక్తి హెల్మెట్ ధరించి, కాగితం పట్టుకుని కనిపించాడు. అతడు షోరూమ్లోకి ప్రవేశించగానే.. మిగిలిన ఇద్దరు వ్యక్తులు భయాందోళనలు సృష్టించడానికి స్పష్టంగా గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. కాసేపటికి లోపలికి వెళ్లిన వ్యక్తి బయటకు వచ్చి మరో ఇద్దరితో కలిసి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ముగ్గురూ వెళ్ళిపోయారు. అనంరతం వారిలో ఒకరు వెనక్కి తిరిగి మరిన్ని షాట్లు కాల్చాడు.
షూటర్లు జితేంద్ర గోగి గ్యాంగ్కు చెందినవారని తెలిసింది. 2021లో రోహిణి కోర్టులో గ్యాంగ్స్టర్ జితేంద్ర గోగిని కాల్చి చంపగా.. జైల్లో ఉన్న అతని సహాయకుడు దీపక్ బాక్సర్ ఇప్పుడు ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ముఠాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో కూడా లింకులు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ముఠా ఈ తరహాలో వసూళ్లకు పాల్పడటం ప్రారంభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సోమవారం ఢిల్లీలోని నంగ్లోయ్, అలీపూర్లో రెండు కాల్పుల ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఈ కేసుల్లోనూ గోగీ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు బృందం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ మాట్లాడాలి
తాజావార్తలు
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!