CPI : పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి నిబద్దతతో పనిచేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి నిబద్దతతో పనిచేస్తామని కొత్తగూడెం మున్సిపల్ సీపీఐ పక్ష కౌన్సిలర్లు స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్ కె సాబీర్ పాషా, పోటు ప్రసాదులతో సమావేశమైన అనంతరం వారు మాట్లాడారు. బూర్జువా పార్టీలతో పొత్తుల విషయంలో జరుగుతున్న తాత్సారం, జాప్యం, కంమ్యూనిస్టులపట్ల ప్రజల్లో కలుగుతున్న ఆలోచనల నేపధ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా పక్షాన తొందరపాటుతో ప్రకటన విడుద చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అభ్యర్థి విషయంలో తమ అభిప్రాయాన్ని రాష్ట్ర పార్టీ ప్రతినిధికి వివరించామని, మా అభిప్రాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తామని, పార్టీలో ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని ఈ విషయంలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కండిస్తున్నామని తెలిపారు.
Also Read : Jasprit Bumrah: ప్రపంచకప్లో మరో రికార్డ్.. తొలి బంతికే ఘనత సాధించిన స్టార్ బౌలర్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నాయకత్వంలో అయన సూచనమేరకు నిబద్ధతతో పని చేస్తామని, వచ్చే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ కౌన్సిలర్ల అభిప్రాయంపై వారితో చేర్చించామని, సమస్య సమసిపోయిందని తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషిచేసేందుకు కౌన్సిలర్లు ముందుకు వచ్చారని తెలిపారు. సమావేశంలో సిపిఐ పక్ష కౌన్సిలర్లు, నాయకులు వై శ్రీనివాసరెడ్డి, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, పి సత్యనారాయణ చారి, నాయకులు ముత్యాల విశ్వనాధం, మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లికార్జునరావు, ఉదయ్ భాస్కర్, జి వీరాస్వామి, వంగ వెంకట్, గెడ్డాడు నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Mohammed Shami: మహ్మద్ షమీ ఖాతాలో మరో రికార్డ్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!